ఛీ ఛీ! రాజ్ తరుణ్ ఇలాంటి వాడా? బయట పడుతున్న షాకింగ్ నిజాలు?

murali krishna
హీరో రాజ్ తరుణ్ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. లావణ్య అనే యువతి రాజ్ తరుణ్‌పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. లావణ్య అనే యువతి హీరో రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ రోడ్డెక్కడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాకుండా రాజ్ తరుణ్‌తో 11 ఏళ్ల నుంచి రిలేషన్‌ ఉన్నానని మధ్యలో ఓ హీరోయిన్ రావడంతో ఆమెతో ఎఫైర్ పెట్టుకుని వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది..హీరో రాజ్‌తరుణ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ, హీరోయిన్ మాల్వీ తనను బెదిరిస్తోందంటూ మాజీ ప్రియురాలు లావణ్య, అలాగే తన సోదరుడికు మెసేజుల పంపుతుందంటూహీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. బుధ‌వారం లావణ్య మ‌రోసారి రాజ్ తరుణ్, మాల్వీల‌పై ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా పోలీసులకు కొన్ని ముఖ్య ఆధారాలు ఇచ్చినట్లు స‌మాచారం. వాటిలో రాజ్ త‌రుణ్‌తు ఉన్న 170 ఫొటోలు, ఇంకా ప‌లు టెక్నిక‌ల్ అండ్ మెడిక‌ల్ ఎవిడెన్స్‌లు అందజేసింది. దీంతో నార్సింగ్ పోలీసులు హీరో రాజ్ తరుణ్ పై ఐపీసీ 493 సహా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.అయితే.. రాజ్‌తరుణ్‌తో పదేళ్ల క్రితమే పెళ్లి అయ్యిందని, ప‌దేండ్లుగా కాపురం చేశామని.. కొన్నాళ్ల క్రితం ప్రెగ్నెన్సీ వ‌స్తే అబార్షన్ చేయించాడంటూ లావణ్య ఆరోపించింది. అందుకు సంబంధించి మెడికల్ డాక్యుమెంట్స్‌ను పోలీసులకు అందించానని తెలిపింది. అంతేకాకుండా చాలాకాలం అన్విక పేరుతో కలిసి ఉన్నామని.. అదే పేరుతో విదేశాలకు కూడా కలిసి వెళ్లిన‌ట్లు లావ‌ణ్య‌ పేర్కొంది.


తాజాగా ఈ కేసుకు సంబంధించిన FIR కాపీలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో A1గా రాజ్‌తరుణ్‌ ఉంటే.. A2గా మాల్వీ మల్హోత్రా, A3గా మయాంక్ మల్హోత్రాను చేర్చారు నార్సింగి పోలీసులు. రాజ్‌తరుణ్‌, మాల్వీ మల్హోత్రా, మయాంక్‌ మల్హోత్రాపై 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా కంప్లైంట్‌ కాపీలో లావణ్య చాలా విషయాల్ని ప్రస్తావించింది. రాజ్‌తరుణ్ తనకు ఎప్పుడు పరిచయం అనే దగ్గర మొదలుపెట్టి.. ఇటీవలి వరకూ ఏం జరిగిందో పేర్కొంది. 2008 నుంచి రాజ్‌తరుణ్‌తో తనకు పరిచయం ఉందనేది లావణ్య వాదన. 2010లో రాజ్‌తరుణ్‌ లవ్ ప్రపోజ్‌ చేశాడు.. 2014లో తనను పెళ్లి చేసుకున్నాడని చెప్తోంది. అలాగే రాజ్‌తరుణ్‌కు తాను గతంలో 70 లక్షలు ఇచ్చానంటోంది.2016లో రాజ్‌తరుణ్‌ వల్ల తాను గర్భవతిని అయ్యానని, అయితే రెండో నెలలోనే అబార్షన్ చేయించారని లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తనను అనవసరంగా డ్రగ్స్ కేసులో రాజ్‌తరుణ్, మాల్వీ ఇరికించారని లావణ్య ఆరోపిస్తోంది. తనను మోసం చేసిన రాజ్‌తరుణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతోంది. మరోవైపు హీరోయిన్ మాల్వీ, ఆమె సోదరుడు చంపుతామని బెదిరిస్తున్నారంటోంది లావణ్య.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: