ఆషాడం ఎఫెక్ట్.. మహేశ్ రాజమౌళి మూవీకి బ్రేక్..!?

Anilkumar
త్రిబుల్ ఆర్ సినిమాతో తన సత్తా ఏంటో చూపించాడు స్టార్ డైరెక్టర్ రాజమౌళి. త్రిబుల్ ఆర్ సినిమాతో ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకున్న దర్శక ధీరుడు రాజమౌళి తాజాగా తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు అన్న వార్తలు ఎంతో కాలంగా సోషల్ మీడియాలో వినబడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు సరికొత్త ట్రైనింగ్ సైతం తీసుకుంటున్నాడట. అలాగే ఈ సినిమా కోసం తన లుక్ మొత్తం మార్చేశాడు. లాంగ్ హెయిర్ తో హాలీవుడ్ రేంజ్ హీరోలా

 మారిపోయాడు మహేష్ బాబు.  ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్స్ సైతం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే.. ప్రస్తుతం ఆషాడ మాసం కొనసాగుతోంది. ఆషాఢ మాసం జూన్ 23 నుంచి జూలై 21 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో శుభకార్యాలతో పాటు ఎలాంటి పనులు ప్రారంభించడానికి ఎవరూ ఆసక్తి చూపరు. జక్కన్న కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారట. అందుకే ఈ

 సమయంలో తన కొత్త ముహూర్తం పెట్టకూడదని రాజమౌళి నిర్ణయించుకున్నారట. 'SSMB29' (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కుతోన్న ఈ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో అడ్వెంచెరస్ థ్రిల్లర్ జానర్ లో ఉంటుందని ఇప్పటికే స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చారు. ఇక మహేష్ బాబు లో హీరోయిన్‌గా ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లెన్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చెల్సియా ఇస్లెన్‌కు స్క్రీన్ టెస్ట్ కూడా నిర్వహించారట. అయితే దీనిపై ఇంకా స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. ఈ కు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చనున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: