వారి బాటలోనే ప్రయాణించనున్న నిఖిల్.. స్వయంభు గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నబా నటేష్..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో నిఖిల్ ఒకరు. ఈయన హ్యాపీ డేస్ మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అలాంటి సమయం లోనే నిఖిల్ "స్వామి రా రా" అనే మూవీ తో మంచి విజయాన్ని అందుకొని అద్భుతమైన ఫామ్ లోకి వచ్చాడు. అప్పటి నుండి ఈ నటుడు వైవిధ్యమైన కథలను , డిఫరెంట్ స్టోరీలను ఎంచుకొని సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈయన అనేక విజయాలను అందుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ నటుడు స్వయంభు అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి అయినటువంటి నబా నటేష్ హీరోయిన్ గా కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే నబా నటేష్ తాజాగా ప్రియదర్శి హీరోగా రూపొందిన డార్లింగ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని జూలై 19 వ తేదీన విడుదల చేయనున్నారు. దానితో ఈ బ్యూటీ వరుసగా టీవీ షో లలో , ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ డార్లింగ్ మూవీ ని ప్రమోట్ చేస్తూ వస్తుంది.

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ స్వయంభు మూవీ గురించి ఒక అదిరిపోయే అప్డేట్ ను ఇచ్చింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ఈ బ్యూటీ మాట్లాడుతూ ... స్వయంభు మూవీ ఒక భాగంతో పూర్తి అయ్యే సినిమా కాదు. దానికి రెండు , మూడు భాగాలు ఉంటాయి అని చెప్పింది. ఇలా స్వయంభు మూవీ గురించి ఈమె చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్ హీరోలు తమ సినిమాలను ఒక భాగంతో కాకుండా రెండు భాగాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇక నిఖిల్ కూడా వారి రూట్ లోనే ప్రయాణించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

nn

సంబంధిత వార్తలు: