"విశ్వంభర" లో అదే హైలెట్.. ఏకంగా అంతమందితో షూటింగ్..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి పోయిన సంవత్సరం రెండు మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో మొదటగా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన వాల్టేరు వీరయ్య బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత చిరు "భోళా శంకర్" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన రోజుకో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ యొక్క ఇంట్రవెల్ సన్నివేశాన్ని అత్యంత భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఈ సన్నివేశం ఈ మూవీ కి హైలెట్ సన్నివేశం అని వార్తలు వచ్చాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక యాక్షన్స్ సీక్వెన్సెస్ ను చిత్రీకరిస్తున్నట్లు , ఈ యాక్షన్ సన్నివేషంలో ఏకంగా 500 మంది ఫైటర్స్ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇంటర్వెల్ సన్నివేశం తర్వాత ఈ సన్నివేశం సినిమాకి హైలైట్ గా మారబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ లో అనేక హైలెట్స్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన పనులన్నీ ఫుల్ స్పీడ్ గా జరుగుతున్నాయి. ఓ వైపు ఈ సినిమా చిత్రీకరణ జరుగుతూ ఉండగానే మరో వైపు డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ మూవీ ని దాదాపుగా ఎలాంటి లేట్ లేకుండా సంక్రాంతి కి విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: