ఆ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా మూవీ అఫర్ ను రిజెక్ట్ చేసిన కృతి శెట్టి.. ఎందుకో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటి మనులలో కృతి శెట్టి ఒకరు. ఈమె ఉప్పెన అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ తో తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం అందుకోవడం , ఇందులో ఈమె తన నటనతో , అంతకు మించిన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగులో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈమె అనేక సినిమాలలో నటించి తెలుగులో అద్భుతమైన గుర్తింపును దక్కించుకుంది.

ఇది ఇలా ఉంటే ఈమె కొంత కాలం క్రితం ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో అవకాశాన్ని రిజెక్ట్ చేసిందట. ఆ మూవీ ఏది ... ఎందుకు ఈ బ్యూటీ ఆ సినిమా ఆఫర్ ను చేసింది అనే వివరాలను తెలుసుకుందాం. కొంత కాలం క్రితం అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 1 అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం. ఈ మూవీ బృందం మొదట ఈ బ్యూటీ నే సంప్రదించిందట.

కాకపోతే అప్పటికే కెరియర్ మొదలు పెట్టి చాలా తక్కువ కాలం కావడంతో మరి ఇంత తక్కువ సమయంలో అలాంటి పాటలలో నటిస్తే ఆ తర్వాత కూడా అలాంటి అవకాశాలే వస్తాయి , హీరోయిన్ అవకాశాలు తగ్గుతాయి అనే ఉద్దేశంతో ఆమె ఆ సాంగ్ ను రిజక్ట్ చేసిందంట. దానితో ఈ మూవీ బృందం వారు సమంత ను సంప్రదించడం , ఆమె ఈ పాటలో నటించడానికి ఓకే చెప్పడం జరిగిందట. అలా కృతి శెట్టి పాన్ ఇండియా మూవీ ని రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశం సమంత కు వెళ్లిందట. ఇకపోతే తాజాగా కృతి శెట్టి "మనమే" అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: