ఇది కదా క్రేజీ కాంబినేషన్ అంటే.. ఆ డైరెక్టర్ తో విశ్వక్ సేన్ సినిమా?

praveen
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా పరిచయమై తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలు కొంతమంది ఉన్నారు. అలాంటి వారిలో విశ్వక్సేన్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఏకంగా తానే ప్రొడ్యూసర్ గా దర్శకుడిగా హీరోగా మారి సినిమాలను తీసి తన కెరియర్ ను తానే నిలబెట్టుకున్నాడు విశ్వక్సేన్. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు యూత్ లో మంచి క్రియేట్ సంపాదించాడు అని చెప్పాలి. మాస్ కా దాస్ అనే ట్యాగ్ ని కూడా సొంతం చేసుకున్నాడు.

 అయితే విశ్వక్సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. మొన్నటికి మొన్న గ్యాంగ్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు మరికొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి విశ్వక్ చేసిన ప్రతి సినిమా కూడా ఇక ప్రేక్షకులకు నచ్చేస్తూ ఉంది  రొటీన్ కాకుండా భిన్నంగా సినిమాలు చేస్తూ సక్సెస్ రూట్ లో ముందుకు సాగుతున్నాడు ఈ యంగ్ హీరో. అయితే ఇక ఇప్పుడు ఈ యంగ్ హీరో ఒక క్రేజీ డైరెక్టర్ తో మూవీ చేయబోతున్నాడట.

 కామెడీ ఓరియంటెడ్ సినిమాలను తనకు మించి ఇంకెవరు తీయలేరు అని నిరూపించుకున్న డైరెక్టర్ అనుదీప్. జాతి రత్నాలు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషన్ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత శివ కార్తికేయన్ తో డాన్ అనే సినిమా తీసి మరోసారి హిట్టు కొట్టాడు  ఇక ఇప్పుడు విశ్వక్సేన్ తో అటు అనుదీప్ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనుదీప్  చెప్పిన కథకు విశ్వక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ మూవీని నిర్మించబోతున్నారట. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ప్రస్తుతం విశ్వక్సేన్ అటు లైలా తో పాటు మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: