ప్రభాస్ మూవీ చూసి మహేష్ షాక్.. వెంటనే ఫోన్ చేసి అలా అన్నాడు.. దిల్ రాజు..!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రాజు ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించి , ఎన్నో మూవీలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే తాజాగా దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా మిస్టర్ ఫర్ఫెక్ట్ మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.

తాజాగా దిల్ రాజు మాట్లాడుతూ ... మా బ్యానర్ లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మిస్టర్ పర్ఫెక్ట్ అనే మూవీ ని తీసాం. ఆ మూవీ కంటే ముందు ప్రభాస్ వరుసగా యాక్షన్ మూవీలు చేస్తూ వస్తున్నాడు. ఆయనకు మాస్ ఆడియన్స్ లో అద్భుతమైన క్రేజ్ ఉంది. ఇక అలాంటి సమయంలో మేము ఆయనపై మిస్టర్ పర్ఫెక్ట్ అనే పక్కా క్లాస్ , ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించాం. ఆ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి విడుదల అయిన మొదటి రోజే అద్భుతమైన టాక్ ను తెచ్చుకుంది. ఆ సినిమా అలా భారీ ఎత్తున కలక్షన్లను రాబడుతున్న సమయంలో ఒక రోజు నాకు మహేష్ బాబు ఫోన్ చేశాడు.

మహేష్ బాబు ఫోన్ చేసి ... ఇప్పుడే మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ చూశాను. అద్భుతంగా ఉంది. ఒక మాస్ హీరో ని పెట్టుకొని అంత క్లాస్ సినిమా తీయాలి అని మీకు ఎలా అనిపించింది. మీరు పెద్ద రిస్క్ చేశారు. కానీ ఆ రిస్క్ లో మీరు సూపర్ సక్సెస్ అయ్యారు అని మహేష్ అన్నారు అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఇకపోతే దశరథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ , తాప్సి హీరోయిన్లుగా నటించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. నాజర్ , ప్రకాష్ రాజ్ , బ్రహ్మానందం ఈ మూవీ లో ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ మూవీ 2011 ఏప్రిల్ 21 వ తేదీన విడుదల బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: