బిగ్ బాస్ వల్ల ఆయన ఒక్కడికే ఉపయోగం.. బిగ్ బాస్ షో పై ఘాటు కామెంట్ చేసిన షకీలా..!

Pulgam Srinivas
తెలుగులో మంచి గుర్తింపు కలిగిన రియాలిటీ షో లలో బిగ్ బాస్ ఒకటి. ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగులో బుల్లి తెరపై ఏడు సీజన్లను , ఓ టీ టీ పై ఒక సీజన్ ను కంప్లీట్ చేసుకుంది. కొన్ని రోజుల క్రితమే బిగ్ బాస్ ఏడవ సీజన్ పూర్తి అయ్యింది. ఇందులో పల్లవి ప్రశాంత్ గెలుపొందాడు. ఇకపోతే బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్లోకి మొదటి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మరో ఐదుగురు మధ్యలో వచ్చారు. ఇక బిగ్ బాస్ సెవెన్ లో షకీలా కూడా మొదట వచ్చిన 14 మంది కంటెస్టెంట్లలో ఒకరిగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

కానీ హౌస్ మేట్స్ తో పెద్దగా కలవకపోవడం , ఇతర కారణాల వల్ల ఈమె ఎక్కువ రోజు హౌస్ లో ఎక్కువ కాలం ఉండలేదు. ఈమె రెండవ వారమే హౌసు నుండి ఎలిమినేట్ అయింది. ఇకపోతే తాజాగా షకీలా బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. అసలు విషయం లోకి వెళితే... తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా షకీలా మాట్లాడుతూ ... నాకు హౌస్ లో ఆట సందీప్ , అమర్ దీప్ , ప్రియాంక , దామిని నిజాయితీగా అనిపించారు. వారి కళ్ళలో నాకు ఫేక్ న్యూస్ కనబడలేదు. ఇక శివాజీ న్యూట్రల్ గా ఉన్నాడు. అతడు మంచోడో ... చెడ్డోడు నాకు తెలియదు. వెనకబడిన కాంటెస్టెంట్లకు మాత్రం సపోర్ట్ ఇచ్చేవాడు.

పల్లవి ప్రశాంత్ మాత్రం నాకు ఏ మాత్రం నచ్చలేదు అని ఈమె చెప్పింది. ఇంకా ఆమె మాట్లాడుతూ ... కేవలం నన్ను పబ్లిసిటీ కోసమే తీసుకున్నారు. అవసరం తీరిపోయాక ఎలిమినేట్ చేసేసారు. నాకు బిగ్ బాస్ వల్ల ఒరిగింది ఏమీ లేదు. పేమెంట్ ఇచ్చారు. అందుకే నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాను అని ఏమి చెప్పింది. ఇక బిగ్ బాస్ వలన ప్రయోజనం ఆ ఒక్క నాగార్జునకే , ఎందుకంటే ఆయన స్టూడియోలోనే బిగ్ బాస్ సెట్ ఉంది. అలాగే ఆయన హోస్ట్ గా చేస్తున్నారు అని ఈమె తాజా ఇంటర్వ్యూ లో భాగంగా బిగ్ బాస్ షో పై చాలా ఘాటు కామెంట్లు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: