రాజా సాబ్: ఏదో తేడాగా ఉందే? టెన్షన్లో ఫ్యాన్స్?

Purushottham Vinay
రాజా సాబ్: ఏదో తేడాగా ఉందే? టెన్షన్లో ఫ్యాన్స్? 

 ప్రభాస్ హీరోగా యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్‌గా రూపొందిన కల్కి 2898 ఏడీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల ఊచకోత కోస్తున్నది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వినీదత్ 600 కోట్లతో రూపొందించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది.అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోన్ నటించిన ఈ సినిమా అదరగోడుతుంది. ఇప్పటికే ఈ సినిమా ఏకంగా 680 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. ఇంకా రాబడుతుంది కూడా. ఇక అతి త్వరలో రూ. 1000 కోట్లు సాధిస్తుందని ఫ్యాన్స్ అంతా భావిస్తున్నారు. ఈ మూవీలో అమితాబ్, కమల్, దీపికా, దిశా పటాని లాంటి స్టార్స్ నటించారు. బాలీవుడ్ లో 145 కోట్ల వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా.

ఇదిలా ఉంటే ప్రభాస్ తన తరువాత సినిమాని అసలు ఏమాత్రం టాలెంట్ లేని పస లేని రొట్ట డైరెక్టర్ మారుతీ డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పేరు రాజా సాబ్. ఈ సినిమాని SKN ఇంకా UV క్రియేషన్స్ పై ప్రమోద్, వంశీలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కానీ ఈ సినిమా పై జీరో అంచనాలు ఉన్నాయి. దానికి కారణం ఈ సినిమా డైరెక్టర్. అవును.. టాలీవుడ్ లో ఉన్న అత్యంత చెత్త డైరెక్టర్లలో మారుతీ ఒకడు. రొటీన్ సినిమాలు తీస్తూ ఆడియన్స్ ని చిరాకు పెట్టించే డైరెక్టర్.. కుళ్ళిపోయిన కామెడీ, హారర్ కామెడీ, లోపాలున్న హీరో.. ఇవే మారుతి కథలు.. ఇక రాజాసాబ్ కథ కూడా హరర్ కామెడీ అని చెప్పేసాడు మారుతీ.దీనికి తోడు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. దీంతో తమన్, మారుతీని సరిపోయారు ఇద్దరూ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. రాజసాబ్ రిజల్ట్ విషయంలో చాలా టెన్షన్ గా ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇదేదో తేడాగా ఉందే అనుకోని తెగ ఫీల్ అయిపోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరి చూడాలి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందనేది?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: