ఇంట్రెస్టింగ్ టైటిల్ తో మంచు లక్ష్మి వాట్సాప్ గ్రూప్.. అందులో ఆ ఇద్దరు స్టార్ హీరోలు కూడా..?

Pulgam Srinivas
టాలీవుడ్ నటి మంచు లక్ష్మి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె కొంత కాలం క్రితమే ముంబై కి షిఫ్ట్ అయింది. ఇక ముంబై కి షిఫ్ట్ కావలసిన అవసరాల గురించి ఈమె వివరిస్తూ అక్కడ మంచి అవకాశాలు వస్తాయి అని , అలాగే తన కూతురు భవిష్యత్తు ఎంతో బాగుంటుంది అనే ఉద్దేశం తోనే ముంబై కి షిఫ్ట్ కావాలి అని అనుకున్నట్లు అందులోనే భాగంగా ముంబై కి వెళ్ళినట్లు ఈ నటి తెలియజేసింది.

అలాగే మొదట్లో తాను ముంబై కి షిఫ్ట్ కావాలి అని తన పేరెంట్స్ కి చెప్పినప్పుడు వారు అందుకు ఒప్పుకోలేదు అని , మేమంతా ఎంతో కలిసి మెలిసి ఉంటాం. ఎప్పుడు అనేక విషయాలపై చర్చిస్తూ ఉంటాం. అలా ఎప్పుడూ కలిసి ఉండే ఒక వ్యక్తి ఇంట్లో నుండి దూరంగా వెళ్ళిపోతుంది అనే బాధతో వారు నన్ను ఇంట్లో నుండి వెళ్ళనివ్వలేదు అని వివరించింది. ఇకపోతే ముంబై కి వెళ్లిన కొత్తలో అక్కడ ఉండడానికి ఇల్లు లేకపోతే రామ్ చరణ్ ఇంట్లో కొన్ని రోజులు ఉండి తర్వాత వేరే ఇంట్లోకి మారాను అని కూడా ఈమె వివరించింది.

ఇక తాజాగా ఈమె మాట్లాడుతూ.... ENOUGH OF THIS ANIMOSITY  (ఈ శత్రుత్వం చాలు) అనే పేరుతో ఓ వాట్సప్ గ్రూపు నడుపుతున్నట్లు , దీంట్లో ఏకంగా 142 మంది తెలుగు సినీ నటీనటులు ఉన్నట్లు మంచు లక్ష్మి పేర్కొంది. ఇక ఈ గ్రూపులో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అయినటువంటి రామ్ చరణ్ , అల్లు అర్జున్ కూడా ఉన్నారు అని ఈమె పేర్కొంది. టాలీవుడ్ లో ఫ్యామిలీ ఫీలింగ్ పెంపొందించడమే ఈ గ్రూపు యొక్క ముఖ్య ఉద్దేశం అని , ఈ వాట్సాప్ గ్రూప్ లో కొత్త సినిమాలు , ట్రైలర్లు అలాగే అనేక సినిమాలకు సంబంధించిన విషయాలను ఇందులో పోస్ట్ చేస్తాము అని మంచు లక్ష్మి పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: