టి20 విజయం పట్ల స్పందిస్తున్న సినీ సెలబ్రిటీస్.. పోస్టులతో మోత మోగుతున్న ఇంస్టాగ్రామ్..!

lakhmi saranya
టీమిండియా 2024, టి20 ప్రపంచ కప్ కైవసం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా సినీ సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకులు, మాజీ క్రికెటర్స్, నార్మల్ ఆడియన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాని హోరెక్కిస్తున్నారు. ఇక ‌బార్బార్బెడో వేదికన చివరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ ముగిసిన ఈ మ్యాచ్ తాజాగా సినీ సెలబ్రిటీలు ఇంస్తాగ్రం వేదికన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక ఈ సందర్భంగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.." భారత్ జట్టు అద్భుతమైన విజయం సాధించింది. నిజంగా చెప్పాలంటే క్లాస్ యాక్ట్. మ్యాచ్ మొత్తం నా సీటు అంచులోనే ఉన్నాను. టీం మొత్తం కూడా వెరీ టాలెంటెడ్. రోహిత్ శర్మ మీరు ఎంతో తెలివితో జట్టును ముందుకు నడిపిస్తూ చాలా ఓపికగా ఉన్నారు " అంటూ రాస్కొచ్చింది. అలాగే.. ఈరోజు చాలా గ్రేట్ డే. ఒక ఎ పిక్ ఫిల్మ్ చూశాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. భారతదేశం గెలిచింది. కంగ్రాట్స్ టీమ్ ఇండియా.. అంటూ రాశి కన్నా రాస్కొచ్చింది.
అదేవిధంగా తమ ఇంస్టాగ్రామ్ వేదికగా రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠి, రష్మిక మందన, శ్రీముఖి, సాయి ధరం తేజ్, వెంకటేష్, సీనియర్ హీరోయిన్ స్నేహ, వరుణ్ తేజ్ ఇలా పలువురు ట్వీట్లు పెట్టారు. ప్రెసెంట్ వీరి ట్వీట్స్ తో instagram ని వేరే లెవెల్ కి తీసుకెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరాల ఇండియన్ ప్రేక్షకుల కల నేడు నెరవేరడంతో సామాన్యులు సైతం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ టీం ఇండియా టీం కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మొత్తానికి ఈసారి టీమిండియా వరల్డ్ కప్ కొట్టేసింది. ఇక టీమిండియా విజయం పై నరేంద్ర మోడీ సైతం స్పందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజెంట్ వీరందరి ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: