కూతుర్ల మధ్య నలిగిపోతున్న బాలయ్య.. కారణం..?

Divya
నందమూరి వారసుడుగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం గత కొన్నిల్లుగా అభిమానులు అయితే ఎదురుచూస్తూ ఉన్నారు.. ఇప్పటికే మోక్షజ్ఞ ఏంట్రి చాలా ఆలస్యమైందనే వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి.. ఎన్టీఆర్ వంటి వారు చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చి పలు రికార్డులను సైతం తిరగరాసారు.. ప్రస్తుతం మోక్షజ్ఞ ఏజ్ కూడా మూడు పదుల వయసు దగ్గరికి వస్తోంది. ఇప్పుడు కూడా ఎంట్రీ పైన ఇంకా క్లారిటీ ఇవ్వలేదు బాలయ్య. ముఖ్యంగా మోక్షజ్ఞ ఎంట్రీ ఏ దర్శకుడు తో ఉంటుంది అనే విషయం పైన కూడా ఇంకా ఒక కొలిక్కి రాకముందే బాలయ్య ఇంట్ల ఒక పెద్ద చిక్కు వచ్చి పడ్డట్టుగా తెలుస్తోంది. వాటి గురించి పూర్తిగా చూద్దాం.

మోక్షజ్ఞ తన ఎంట్రీ కోసం ప్రస్తుతం చాలా స్టైలిష్ గా కూడా మారిపోయారు. సరైన కథ పడితే తన తొలి సినిమాతోనే మంచి సక్సెస్ ని అందుకుంటారని చెప్పవచ్చు. బాలయ్య కెరియర్ లోనే బెస్ట్ చిత్రమైన ఆదిత్య 369 ఆదిత్య-999 చిత్రంతో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనే విధంగా వార్తలు వినిపించాయి. తానే డైరెక్టర్గా బాధ్యతలు తీసుకుంటారని కూడా ఆ మధ్య తెలియచేసిన మళ్లీ మాట్లాడలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

ఇక్కడే బాలయ్యకు ఒక సమస్యగా మారింది. అదేమిటంటే ఈ చిత్రాన్ని నిర్మించడానికి బాలయ్య ఇద్దరు కుమార్తెలు నారా బ్రాహ్మణి ,తేజస్విని సైతం పోటీ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని ముందు నుంచి సినిమాలు అంటే కాస్త మక్కువ ఎక్కువ.. అందుకే మోక్షజ్ఞ సినిమాలు నిర్మించాలని పట్టుదలతో ఉన్నదట. మరొక పక్కన నారా బ్రాహ్మణి కూడా మోక్షజ్ఞ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఇద్దరి కూతుర్ల మధ్య బాలయ్య నలిగిపోతున్నారు.. ఈ విషయం తెలిసి బాలయ్య అభిమానులు కూడా ఫన్నీ గానే కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: