మరికొద్ది గంటల్లో కల్కి.. ఇంతలోపే అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్..!

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా కల్కి. ఈ సినిమా కోసం ప్రపంచ స్థాయిలో ఉన్న సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన సంబరాలు ఇప్పటికే స్టార్ట్ చేశారు డార్లింగ్ అభిమానులు. కొందరైతే కళ్ళల్లో వత్తులు వేసుకొని మరీ దీనికోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బాహుబలి సినిమా తర్వాత అంతటి విజయాన్ని అందుకోవడానికి రెడీగా ఉన్నాడు ప్రభాస్. మరి కొద్ది గంటల్లో సినిమా విడుదలై థియేటర్స్

 లో సందడి చేయబోతోంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా 600 కోట్లకు పైగానే ఖర్చు చేసి చాలా గ్రాండ్ గా తీస్తున్నారు. ఇప్పటికే ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం మొదటి రోజు ఈ సినిమా 1200 కోట్లకు పైగానే కలెక్ట్ చేస్తుంది అన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే కేవలం మొదటి రోజు మాత్రమే ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తే మిగతా రోజుల్లో ఈ సినిమా పరిస్థితి ఏంటి అని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ట్రైలర్ విడుదల చేయడంతో కలిపి సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

 అందులో భాగంగానే రోజు ఒక అప్డేట్ విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నారు. అంతేకాదు దీనికి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలు సైతం శరవేగంగా జరుపుతున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.  . ఈ సినిమాలో కృష్ణుడి క్యారెక్టర్ లో సీనియర్ ఎన్టీ రామారావు గారిని చూపించబోతున్నారట . అశ్విని దత్ సీనియర్ ఎన్టీ రామారావు గారికి ఎంత పెద్ద వీర అభిమాని అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . నిజానికి తెరపై కృష్ణుడిగా చూడాలి అంటే అది రామారావు గారి తర్వాతే ఎవరైనా .. ఎంతమంది ఎంత బాగా నటించినా మనకి కృష్ణుడు అనగానే మొదటగా ఆయన రూపమే గుర్తొస్తుంది .. అలాంటి ఓ చెరగని స్థానాన్ని అందుకున్నాడు సీనియర్ ఎన్టీ రామారావు గారు .. అయితే ఏఐ ఎఫెక్ట్స్ తో పలు టెక్నిక్స్ ఉపయోగించి కృష్ణుడి క్యారెక్టర్ లో మళ్లీ జనాలకు తెరపై సీనియర్ ఎన్టీ రామారావు గారిని చూపించబోతున్నాడట నాగ్ అశ్వీన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: