వావ్: కల్కి చిత్రానికి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్..టికెట్ రేటు పెంపు..!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అఫైడెడ్ మూవీ గా ఈ ఏడాది ఉన్న చిత్రాలలో ప్రభాస్ నటించిన కల్కి చిత్రం కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని ఎన్నో భాషలలో సైతం డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమా కావడంతో అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చేస్తున్నారు. అలాగే కమలహాసన్ అమితాబచ్చన్, దిశా పటాని, దీపికా పదుకొనే, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం తదితర నటీనటుల సైతం ఇందులో నటిస్తూ ఉండడం గమనార్హం. అంతేకాకుండా ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ట్రైలర్స్ టీజర్ పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

అయితే ఇంతటి భారీ బడ్జెట్ చిత్రానికి టికెట్లు రేట్లు ఎలా ఉంటాయని విషయం పైన తాజాగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా రెండు వారాలపాటు సింగల్ స్క్రీన్ లో 75 రూపాయలు.. మల్టీప్లెక్స్ థియేటర్లలో 125 రూపాయల వరకు పెంచుకోవచ్చు అంటూ ఉత్తర్వులను కూడా జారీ చేసిందట. వీటితో పాటు రోజుకు 5 షోలు వేసుకునేందుకు కూడా అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రం ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది.

చివరిగా ప్రభాస్ గత ఏడాది సలార్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. దాదాపుగా కల్కి సినిమా కోసం కథ రాయడానికే ఐదు సంవత్సరాలు కేటాయించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమాని ఎలా తెరకెక్కించి ఉంటారని విషయం పైన కూడా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఇందులో రెండు విభిన్నమైన క్యారెక్టర్లలో కనిపించబోతున్నారని.. ముఖ్యంగా మహాభారతం సినిమాకి సంబంధించి ఈ సినిమా స్టోరీ ఉండేలా కనిపిస్తోందని ట్రైలర్లో చూస్తే కనిపిస్తోంది.ఇప్పటికే ఇతర దేశాలలో కూడా కల్కి చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ని వేగవంతం చేస్తున్నారు చిత్రబృందం. అంతేకాకుండా బుజ్జి అనే ఒక కారును కూడా అన్ని ప్రాంతాలలో తిప్పుతూ ఉన్నారు. మరి కల్కి సినిమాకి ఏపీ సర్కార్ అందించిన ఈ గుడ్ న్యూస్ ఏ విధంగా కలిసొస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: