నెట్టింటా వైరల్ అవుతున్న 'ఎన్టీఆర్' ఎమోషనల్ పోస్ట్..?

murali krishna

యంగ్  టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా స్టార్ గా లు చేస్తున్నాడు తారక్.ఆర్ఆర్ఆర్ తో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. దేవర అనే పవర్ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు భాగాలుగా ఈ తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే తారక్ కు ఇష్టమైన దర్శకుల్లో వివి వినాయక్ ఒకరు.. మరొకరు రాజమౌళి. ఈ ఇద్దరి దర్శకత్వంలో సూపర్ హిట్ లు చేశాడు ఎన్టీఆర్. రాజమౌళి డైరెక్షన్ లో స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ లు చేశాడు. అలాగే వివి వినాయక్ డైరెక్షన్ లో ఆది, సాంబ, అదుర్స్ చిత్రాలు వచ్చాయి.
కాగా బాలకృష్ణ అంటే తారక్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా బాలకృష్ణ పై తన అభిమానాన్ని చాటుతుంటారు తారక్. అలానే ఎన్టీఆర్ బాలకృష్ణ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నందమూరి ఫ్యామిలికి ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు. నందమూరి ఫ్యామిలీ తారక్ ను దూరం పెడుతున్నారు అంటూ ఏవేవో గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ అర్ధం లేని వార్తలను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు.
ఈ వార్తల్లో నిజం లేదు అని ఫ్యాన్స్ గట్టిగా చెప్తున్నారు. అందుకు సాక్షంగా తారక్ బాలకృష్ణ మీద తన ప్రేమ చూపిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదుర్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ వేదిక పై జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. చాలా ఎమోషనల్ అయ్యారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తుండగా ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదంకు గురైన విషయం తెలిసిందే. ఆ ప్రమాదం తర్వాత చేసిన మొదటి అదుర్స్. ఈ వేదిక పై ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నా గుండె కొస్తే తాతగారు ఎన్టీఆర్ కనిపిస్తారని అందరూ అంటుంటారు.. కానీ నా గుండె కొస్తే మా బాబాయి కనిపిస్తారు అని అన్నారు. నేను క్షేమంగా ఉన్నాను అంటే మా తాతగారి ఆశీస్సులు, నా తల్లిదండ్రుల ఆశీస్సులు, అలాగే మాయా బాబాయ్ ఆశీస్సుల వల్లే అని ఎమోషనల్ అయ్యారు ఎన్టీఆర్. ఈ ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: