గోపీచంద్ మలినేని.. సన్నీ డియోల్ కాంబో మూవీలో ఇద్దరు స్టార్ బ్యూటీస్... ఎవరో తెలుసా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మాస్ దర్శకులలో ఒకరు అయినటువంటి గోపీచంద్ మలినేని ఆఖరుగా బాలకృష్ణ హీరో గా రూపొందిన వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈయన మాస్ మహారాజా రవితేజ హీరో గా మైత్రి సంస్థ బ్యానర్ లో ఓ మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు. అందులో భాగంగా ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా ఆగిపోయింది. దానితో రవితేజ వేరే సినిమాలను చూసుకున్నాడు.

ఇక మైత్రి సంస్థ వారు మాత్రం గోపీచంద్ చేయబోయే తదుపరి మూవీని చేయడానికి కమిట్ అయి ఉన్నారు. అందులో భాగంగా తాజాగా మైత్రి సంస్థ , గోపీచంద్ మలినేని కాంబో మూవీ స్టార్ట్ అయ్యింది. ఈ కాంబో మూవీ లో బాలీవుడ్ నటుడు అయినటువంటి సన్నీ డియోల్ హీరో గా నటించబోతున్నాడు. నిన్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఇకపోతే ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి అయినటువంటి రెజినా కసాండ్రా , సయామీ కేర్ హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. 

సన్నీ డియోల్ కొంత కాలం క్రితం గదర్ 2 అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ విజయంతో ఈయన క్రేజ్ మరింత పెరిగింది. ఇక వీర సింహా రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం , గదర్ 2 ఇలాంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత సన్నీ లియోన్ హీరోగా రూపొందనున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ఇటు తెలుగు , అటు హిందీ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది. ఈ మూవీ అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

gm

సంబంధిత వార్తలు: