టాలీవుడ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బుట్టబొమ్మ..!!

murali krishna
టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ తన అందంతో,అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.ఈ భామ నాగ చైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఆ తరువాత వరుసగా స్టార్ హీరోల సరసన ఆఫర్స్ రావడంతో ఈ భామ స్టార్ హీరోయిన్ గా మారింది.ప్రస్తుతం ఈ భామకు టాలీవుడ్ లో ఆఫర్స్ అంతగా రావడం లేదు.ఈ భామ నటించిన రాధే శ్యాం ,ఆచార్యావంటి సినిమాలు పేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి .దీనితో ఈ భామకు స్టార్ హీరోల సరసన అంతగా ఆఫర్స్ రావడం లేదు .దీనితో ఈభామ కోలీవుడ్ ,బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించు కుంటుంది.ముకుంద’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే చాలా తక్కువ టైం లోనే స్టార్ స్టేటస్ అందుకుంది.
ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు.. ఇలా స్టార్ హీరోలందరితో నటించి భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే గత కొంతకాలంగా తెలుగులో పెద్దగా ఆఫర్స్ లేని ఈ ముద్దుగుమ్మ తనకు తెలుగు సినిమా ఎంతో ప్రత్యేకం అని అంటోంది. ప్రస్తుతం ఇతర భాషల్లో అవకాశాలు అందుకుంటున్న పూజా హెగ్డే.. తాజాగా అభిమానులతో జరిపిన చిట్‌చాట్‌లో తెలుగు సినిమాపై తన ప్రేమని బయటపెట్టింది.తాజాగా ఫ్యాన్స్ తో పూజ హెగ్డే చిట్ చాట్ చేసింది. ఇందులో ఓ అభిమాని అన్ని భాషల్లో నటిస్తున్నారు కదా.. నటిగా మీ ప్రయారిటీ ఏ భాషకిస్తారు? అనడిగితే.. ‘నటనకు ప్రాంతీయబేధం లేదు. ఏ భాషలోనైనా నాకు కంఫర్ట్‌గానే ఉంటుంది. అయితే.. తెలుగు సినిమా నాకు ప్రత్యేకం. ఎందుకంటే.. నాకంటూ ఒక ఐడెంటిటీని ఇచ్చింది మాత్రం తెలుగు సినిమానే. అందుకే తెలుగు సినిమా నాకు చాలా స్పెషల్.నేను ఎన్ని భాషల్లో నటించినా.. తెలుగులో అవకాశం వస్తే మాత్రం కాస్త ఎక్కువ ఆనందిస్తా. త్వరలో తెలుగులో ఓ మంచి సినిమా చేస్తా’ అని చెప్పుకొచ్చింది. ఇక రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ సూర్య సరసన ఛాన్స్‌ని కొట్టేసిన పూజా.. ఇటీవలే ఓ హిందీ సినిమాకు కూడా ఓకే చెప్పింది. తెలుగులో అవకాశాలు లేకపోయినా ఇతర భాషాల్లో అవకాశాలను సొంతం చేసుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: