"సీతయ్య" మూవీలో "ఎవరి మాట వినడు" డైలాగు వెనుక ఎంత కథ ఉందో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీలలో హీరో పాత్రలకు ఎలివేషన్ కోసం అనేక డైలాగులను దర్శకులు రాస్తూ ఉంటారు. కానీ అందులో కొన్ని డైలాగులు మాత్రమే అద్భుతమైన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మరికొన్ని డైలాగులు మాత్రం చాలా కాలం నిలిచిపోతూ ఉంటాయి . ఇకపోతే అలా తెలుగు సినీ పరిశ్రమలో వచ్చిన సినిమాలలో అద్భుతమైన స్థాయిలో ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిన డైలాగులలో సీతయ్య ఎవరిమాటా వినడు అనే డైలాగ్ ఒకటి. ఈ డైలాగ్ హరికృష్ణ హీరోగా సౌందర్య , సిమ్రాన్ హీరోయిన్లుగా వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన సీతయ్య మూవీ లోనిది.

ఇకపోతే తాజాగా సీతయ్య మూవీ దర్శకుడు అయినటువంటి వైవిఎస్ చౌదరి పాత్రికేయులతో ముచ్చటించారు. అందులో భాగంగా ఈయన సీతయ్య మూవీలోని ఎవరిమాటా వినడు అనే డైలాగ్ ఎలా వచ్చింది అనే విషయం గురించి వివరించారు. తాజాగా వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ ... నా కెరియర్ ప్రారంభంలో ఎవరి మాట వినకు అనేది నా ఆటోగ్రాఫ్. నా కెరియర్ ప్రారంభించిన కొత్తలో ఎవరైనా నన్ను ఆటోగ్రాఫ్ అడిగితే నేను ఎవరి మాట వినకు వై వి ఎస్ చౌదరి అని రాసి ఇచ్చేవాడిని. ఇక సీతయ్య సినిమాను మొదలు పెట్టాం.

సీతయ్య అనే పదం చాలా క్లాస్ గా అనిపిస్తుంది. దానికి ఒక మాస్ ఇంపాక్ట్ ను క్రియేట్ చేయాలి అని అనుకున్నాం. అలాంటి సమయం లో సీతయ్య ఎవరిమాటా వినడు అనే డైలాగ్ అయితే బాగుంటుంది అని దానిని జోడించాం. అది సూపర్ సక్సెస్ అయ్యింది అని వై వి ఎస్ చౌదరి తాజాగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే సీతయ్య మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఈ మూవీ ద్వారా హరికృష్ణ, సౌందర్య, సిమ్రాన్, వై వి ఎస్ చౌదరి కి మంచి గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: