వామ్మో! దర్శన్ రేణుకా స్వామికి ఇంత నరకం చూపించాడా?

Purushottham Vinay
దర్శన్ అభిమాని రేణుకా స్వామి హత్యకేసులో కన్నడ నటుడు దర్శన్-పవిత్రాగౌడ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. వాళ్లతో పాటు మరో తొమ్మింది మందికి కూడా తాజాగా న్యాయస్థానం పోలీస్ కస్టడీని పొడిగించింది.చంపిన నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. విచారణ సమయంలో పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా? అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని ఆ నిందితులు స్పష్టం చేసారు. ఆ తరువాత జూన్ 20 దాకా పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. తరువాత కోర్టు నుంచి నేరుగా అన్నపూర్ణేశ్వరినగర స్టేషన్ కు తరలించారు.ఇక అక్కడ నుంచి పవిత్ర ని సాంఘిక సంక్షేమ వసతి గృహానికి తరలించారు.హత్యకు ముందు, తరువాత నిందితుల వాట్సాప్, కాల్ హిస్టరీ, కాల్ డేటాని రాబట్టే ప్రయత్నాలు ఫోరెన్సిక్ నిపుణులు కొనసాగిస్తున్నారు. దర్శన్ ని న్యాయనిర్భందానికి పంపించే ఛాన్స్ ఉండటంతో పరప్పన అగ్రహార కారాగారం వద్ద పోలీసులు ముందస్తుగా భద్రతని ఏర్పాటు చేసారు.


ఇప్పటి దాకా 16 మందిని అరెస్ట్ చేసినట్లు డీజీపీ తెలిపారు. మరొకరు పరారీలో ఉన్నట్లు ఆ వ్యక్తి కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.పాపం రేణుకాస్వామి శాఖాహారి అని తెలిసినా కూడా నిందుతులు అతనికి బలవంతంగా బిర్యానీ, ఎముకను నోట్లో పెట్టి తినిపించినట్లు పోలీసులు తెలిపారు.అయితే తినకుండా బయటకు ఉమ్మడంతో మళ్లీ కొట్టారని, మాంసం తింటే శక్తి వస్తుందని, బాస్ కొడితే తట్టుకోవచ్చు అని అతన్ని హేళన చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా అలాగే హత్య చేసే ముందు విద్యుత్ షాక్ కూడా ఇచ్చారని పోలీసులకు గుర్తించారు.మరోవైపు పౌర సంఘాల నుంచి నిందుతలను కఠినంగా శిక్షించాలని బెంగుళూరు, మండ్య, చిత్రదుర్గ ఇంకా దావణ గెరె జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రేణుకా స్వామి కుటుంబ సభ్యులకు కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి ప్రతినిధులు అయితే 5 లక్షలు పరిహారం అందించారు. ఇంకా అలాగే నిందుతుల్లో ఒకరైన అనుకుమార్ ఇలాంటి వాడు అని తెలిసి అతడి తండ్రి చంద్రప్ప గుండెపోటుతో చనిపోయారు. చిత్ర దుర్గలో శనివారమే ఆయన అంత్యక్రియలు ముగిసాయి.అయితే అనూప్ కుమార్ పోలీస్ ల భద్రత మధ్య తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: