చరిత్ర సృష్టించిన రోహిత్.. వరల్డ్ క్రికెట్ లో ఒకే ఒక్కడు?
అయితే ప్రస్తుతం వెస్టిండీస్, యూఎస్ వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో కూడా రోహిత్ శర్మ తన కెప్టెన్సీ తో ఇలాగే అందరిని ఫిదా చేసేస్తూ ఉన్నాడు. ఇక ఈ ప్రపంచకప్ లో కూడా ఒక్క ఓటమి లేకుండా టీమిండియా దూసుకుపోతుంది అని చెప్పాలి. కీలకమైన సూపర్ 8 దశలో కూడా టీమిండియా వరుసగా మూడు విజయాలు సాధించి సెమీఫైనల్ లో అడుగు పెట్టింది. కాగా ఇటీవల ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ ఎంత కసితీరా కొట్టాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపించాడు రోహిత్. సిక్సర్లు ఫోర్ లతో చలరేగిపోయాడు అని చెప్పాలి.
ఇలా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో సిక్సర్ల వర్షం కురిపించిన రోహిత్ శర్మ ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టి20 లలో 200 సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్గా నిలిచాడు రోహిత్ శర్మ. మిగతా ఏ ప్లేయర్ కూడా రోహిత్ శర్మకు దరిదాపుల్లో కూడా లేరు అని చెప్పాలి. 173 సిక్సర్లతో రెండవ స్థానంలో మార్టిన్ గాప్తిల్ ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో బట్లర్ 137, మాక్స్వెల్ 133, పూరన్ 132 సిక్సర్లతో ఇక టి20 ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా టాప్ ఫైవ్ లో ఉన్నారు అని చెప్పాలి. కాగా ఇలా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ సెమీఫైనల్ లో అడుగుపెట్టిన టీమిండియా అక్కడ డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్తో తలబడబోతుంది.