అమలాకి ఆ పని చేయడం రాదా...అంటూ అవాక్కవుతున్న నెటిజన్స్..??

murali krishna
సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్న అందరికీ కామన్ గా నచ్చే జంట నాగార్జున - అమల . అఫ్ కోర్స్ వీళ్ళ గురించి అందరికీ తెలిసిందే . నాగార్జున ఆల్రెడీ దగ్గుబాటి లక్ష్మీని పెళ్లి చేసుకొని నాగచైతన్యకు తండ్రి అయ్యాడు .అయినా సరే ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చేసి అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . ఆ తర్వాత అఖిల్ కు జన్మనిచ్చారు . అయినా సరే సోషల్ మీడియాలో నాగార్జున కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే ఏ సీనియర్ హీరోకి కూడా ఉండదు అని చెప్పచ్చు.టాలీవుడ్ కింగ్ నాగార్జున భార్య హీరోయిన్ అమల తనకు నచ్చిన వంట చేసి పెట్టదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అది ఎందుకో కూడా కారణం చెప్పారు నాగ్. అయితే గతంలో అమల వంటపై నాగార్జున చేసిన కామెంట్స్ నాగార్జున అమల మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా వైరల్ అవుతున్నాయి.ఓ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నాగార్జున తినడంపై యాంకర్ ప్రశ్నించారు. దానికి ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు నాగార్జున. "ఇగ పోయేటప్పుడు ఇంకో ముచ్చట అడుగుతాను సారు.. ఏమనుకోకండి. ఇప్పుడు పోయి ఏం తింటవ్. నేను పొద్దున ఇంత.. మధ్యాహ్నం ఇంతా.. రాత్రి ఇంతా.. గట్టిగా తింటా" అన్నట్లుగా యాంకర్ తెలిపారు. దానికి బాగా నవ్వేసిన నాగార్జున యాంకర్ తినడానికి పూర్తిగా భిన్నంగా చెప్పారు.పొద్దున ఎక్కువ తిని క్రమంగా రాత్రి వరకు చాలా తక్కువ తింటానని నాగార్జున తెలిపారు. దానికి "తిని తిననట్టుగా. ఎందుకు సార్ వంట చేయదా అమల మేడమ్" అని యాంకర్ అడుగుతారు. దానికి బాగా నవ్వేస్తారు నాగార్జున. "ఏంటీ సార్ మరి పొద్దున మిగిలింది రాత్రి తిన్నట్లు అంతే తింటాను అంటున్నరు. అమల మేడమ్ పొద్దున ఒక్కపూటనే వంట చేస్తున్నట్లున్నరు.. రాత్రికి సార్‌కు అన్నం ఉండట్లే" అని యాంకర్ అంటారు.

నాగార్జున . వాళ్ళ ఇంట్లో వంట మొత్తం చెఫ్ లే చేస్తూ ఉంటారట . అంతేకాదు అమలాకి ఏదైనా కావాలి అన్న కూడా వాళ్ల దగ్గరే వండిచ్చుకొని తింటుందట. అమలా వంట చేయడానికి ట్రై చేసిన ఆ వంట సరిగ్గా రాదట . ఎన్నోసార్లు అమల తనకు ఇష్టమైన వంట చేయడానికి ట్రై చేసిందట .కానీ అది ఫ్లాప్ అవుతూ వచ్చిందట . చాలా కాలం ఆమెకు వంట చేయడం రాదట..ఇప్పుడిప్పుడే అలా అలా చేస్తుందట.. అని నాగార్జున ఓపెన్ గా చెప్పేయడంతో ఇప్పుడు ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు. నిజంగానే అమలకు వంట చేయడం రాదా ..? వాట్ ఇస్ దిస్ అంటూ ఆశ్చర్యకరంగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రెసెంట్ అక్కినేని నాగార్జున తన వందన సినిమా కోసం చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్లుగా నయనతార - త్రిష ని తీసుకోవాలి అంటూ ఫిక్స్ అయ్యారట నాగార్జున.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: