దీపిక తెలుగుని ప్రభాస్ మూవీ సీన్ తో ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్..!!
దీపికా పదుకునే తెలుగును ట్రోల్ చెయ్యడానికి రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో సీన్ తీశాడు ఒక నెటిజన్. వీవీ వినాయక్ డైరెక్షన్లో ప్రభాస్, నయనతార జంటగా యాక్ట్ చేసిన 'యోగి' మూవీ గుర్తు వుందిగా! అందులో తల్లికి ప్రభాస్ లెటర్ రాస్తుంటే నయన్ దొంగతనంగా చూస్తుంది. అతడు రాస్తున్న లెటర్ యాజిటీజ్ చదువుతుంది. మెజార్టీ టాలీవుడ్ ఆడియన్స్ దీపిక తెలుగు బాగోలేదని కామెంట్ చేస్తున్నారు.'కల్కి 2898 ఏడీ' మూవీతో దీపికా పదుకునే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతోంది. అయితే, ఆవిడ సైన్ చేసిన ఫస్ట్ తెలుగు మూవీ ఇది కాదు. జయంత్ సి పరాన్జీ డైరెక్షన్లో గతంలో ఒక మూవీ చేసింది. కానీ, అది రిలీజ్ కాలేదు. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయ్యింది. ఇప్పుడు ప్రభాస్ మూవీతో మళ్లీ తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తోంది. అయితే, దీపిక తెలుగు డబ్బింగ్ చెప్పడం ఇది తొలిసారి కాదు. అక్షయ్ కుమార్ 'హౌస్ ఫుల్' మూవీలో తెలుగులో కొన్ని డైలాగ్స్ మాట్లాడుతుంది. ఇది రెండోసారి. అది హిందీ మూవీ కాబట్టి తెలుగు జనాలు పట్టించుకోలేదు. 'కల్కి 2898 ఏడీ' తెలుగు సినిమా కనుక ట్రోల్ చేస్తున్నారు.దీపికా పదుకునే తెలుగు డబ్బింగ్ అసలు బాలేదని, ఛాన్సులు అస్సలు తీసుకోవద్దని, మార్చమని డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్టులు చేస్తున్నారు. మరొక ఫ్యాన్ అయితే అసలు అప్రూవ్ ఎలా చేశారని క్వశ్చన్ చేశాడు. దీపికను,మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇంకొక నెటిజన్ వెటకారం చేశాడు.