సైలెంట్ గా ఆ స్టార్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్..!?

Anilkumar
టాలీవుడ్ ఉస్తాద్ హీరో రామ్ పోతినేని నటించిన  వారియర్ స్కంద సినిమాలతో ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు రామ్. ఇక ఆ సినిమాల ఫ్లాప్ తర్వాత మళ్లీ ఎలాగైనా హిట్ కొట్టాలి అన్న ఉద్దేశంతో పూరి జగన్నాథ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. అదే డబుల్ స్మార్ట్. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని చార్మి పూరి జగన్నాథ్ ఇద్దరు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంతటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా

 చెప్పనవసరం లేదు. అయితే దానికి సీక్వల్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లైగర్ వంటి డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ కెరియర్ అయోమయంలో పడింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందులో భాగంగానే ఇప్పుడు పూరీ జగన్నాథ సైతం లైగర్ వంటి ఫ్లాప్ తర్వాత ఎలాగైనా హిట్టు కొట్టాలి అని డబల్ ఇస్మర్ట్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా వరకు బాగానే ఉన్నప్పటికీ ఈ సినిమా తర్వాత రామ్ ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు

 అన్న విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక అసలు విషయం ఏంటంటే.. ఈ సినిమా తరువాత మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ సినిమా చేయబోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి. దీంతో పాటు మరికొందరు డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ వాటిలో ఎటువంటి వాస్తవం లేదు అని తెలిసిపోయింది. అయితే తాజా  సమాచారం ప్రకారం పోతినేని మహేష్ బాబు దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. సినిమాతో మహేష్ బాబు గత ఏడాది  మిస్ శెట్టి మిస్టర్ పులి శెట్టి సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. మరి ఈ సినిమాతో ఎటువంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: