బాక్స్ ఆఫీస్: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫ్లోని ఆపేసిన మనమే?

Purushottham Vinay
శర్వానంద్  35వ చిత్రంగా 'మనమే' జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భలే మంచి రోజు, శమంతకమణి, దేవ్ దాస్, హీరో వంటి సినిమాలు తీసిన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీని 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' సంస్థ పై టి.జి.విశ్వ ప్రసాద్ నిర్మించగా వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరించడం జరిగింది.ఇంకా అలాగే అలాగే విశ్వప్రసాద్ కూతురు కృతి ప్రసాద్ 'క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా' ఈ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్ గా కృతి శెట్టి  నటించింది.‘మనమే’ విడుదలకు ముందే టీజర్, ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.మొదటి రోజు ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం సో సో గానే వచ్చాయి.కానీ 2వ రోజు ఈ సినిమా బాగానే పికప్ అయ్యింది. 3వ రోజు ఇంకా బాగా కలెక్ట్ చేసింది.


ఇలా రోజు రోజుకి ఈ సినిమా గ్రోత్ బాగానే చూపిస్తుంది. ఒకసారి ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే.. ‘మనమే’ మూవీకి రూ.12.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం మొత్తం రూ.13 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా మొత్తం రూ.4.89 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఖచ్చితంగా ఇంకా రూ.8.11 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఈ సినిమా గ్రోత్ చూస్తుంటే ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. మొత్తానికి ఈ సినిమాకి అయితే పాజిటివ్ టాక్ వచ్చేసింది.మరి చూడాలి ఈ సినిమా ఫైనల్ రన్ లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో..


 ఈ సినిమా రాకతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి వసూళ్లు తగ్గాయి. ఇప్పుడు ఆ సినిమా ఓటీటి విడుదలకి సిద్ధం అవుతుంది.ఈ సినిమా జూన్ 14న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అధికారికంగా సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో అంజలి, నేహా శెట్టి కథానాయికలుగా నటించారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో నాజర్, సాయి కుమార్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: