వాటితో పుకార్లకు చెక్ పెట్టిన కత్రినా కైఫ్..?

Pulgam Srinivas
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి కత్రినా కైఫ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం కూడా ఈమె వరస సినిమాలలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే ఈ ముద్దుగుమ్మ విక్కీ కౌశల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ప్రస్తుతం వీరి సంసార జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే వీరు విదేశీ పర్యటన కోసం లండన్ కి వెళ్లారు. అక్కడ వీరికి సంబంధించిన ఒక ఫోటో బయటకు వచ్చింది. అందులో కత్రినా కాస్త పొట్ట ఉన్నట్లు కనిపించింది. దానితో అనేక మంది అనేక వార్తలు రాయడం మొదలు పెట్టారు. కొంత మంది ఈమె కడుపుతో ఉంది. అందుకే లండన్ కి వెళ్ళింది. అక్కడే కొంత కాలం విశ్రాంతి తీసుకోబోతుంది అని రాసుకురాగ , మరి కొంత మంది మాత్రం ఈమె ప్రస్తుతం కడుపుతో ఉంది. అందుకే లండన్ లో విశ్రాంతి తీసుకుంటుంది.

ఇక డెలివరీ అయ్యే వరకు అక్కడే ఉండి ఆ తర్వాత బిడ్డతో ఇండియాకు తిరిగి వస్తుంది అని రాసిన వారు కూడా ఉన్నారు. ఇలా కత్రినా కు సంబంధించి అనేక వార్తలు వైరల్ అవుతూ ఉంటే తాజాగా ఈమె విదేశీ పర్యటనను ముగించుకొని ఇండియాకు తిరిగి వచ్చింది. ఇక ఎయిర్ పోర్ట్ లో ఈమె ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలలో ఈమె ఫ్లాట్ పొట్టతో కనిపించింది. దీనితో ఈమె గర్భం దాల్చలేదు అని క్లియర్ గా అర్థం అయింది. ఈ ఫోటోల ద్వారా ఈమె ఆమెపై వస్తున్న పుకార్లన్నింటికి చెక్ పెట్టేసింది. ఇకపోతే కొంతకాలం క్రితమే ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన "టైగర్ 3" సినిమాలో హీరోయిన్గా నటించింది. అలాగే మేరీ క్రిస్మస్ అనే సినిమాతో కూడా ఈ బ్యూటీ కొన్ని రోజుల క్రితమే ప్రేక్షకులను పలకరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kk

సంబంధిత వార్తలు: