అందుకే పుష్ప లో ఐటమ్ సాంగ్ చేయొద్దని కుటుంబ సభ్యులు చెప్పారు..సమంత..!

Pulgam Srinivas
నాగ చైతన్య హీరోగా రూపొందిన ఏం మాయ చేసావే మూవీ తో సమంత తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈమెకు తెలుగు లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత సమంత కి వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ కావడంతో చాలా తక్కువ కాలంలో ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్లిపోయింది. ఇక అప్పటి నుండి ఇప్పటివరకు ఈ బ్యూటీ ఎప్పుడు కూడా అవకాశాల కోసం వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు.

ఎప్పుడు కూడా ఈమె చేతినిండా క్రేజీ సినిమా అవకాశాలు ఉంటూనే వస్తున్నాయి. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం నాగ చైతన్య ను సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. వీరి సంసార జీవితం చాలా సంవత్సరాలు సుఖంగా ముందుకు సాగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీరు పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ లో నటించిన విషయం మనకు తెలిసిందే.

ఈ సాంగ్ కి ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ లభించింది. ఇకపోతే తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ... ఈ సాంగ్ చెయ్యొద్దు అని తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు సూచించినట్లు అందుకు గల కారణాలను ఈమె చెప్పుకొచ్చింది. సమంత తాజాగా మాట్లాడుతూ ... ఈ సాంగ్ ఆఫర్ వచ్చిన సమయంలో తాను విడాకులు తీసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాను. అలాంటి సమయంలో పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించవద్దు అని కుటుంబ సభ్యులు , సన్నిహితులు చెప్పారు. కానీ వారి మాట వినకుండా నేను ఆ పాటలో నటించాను అని సమంత చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: