పుష్ప.. మిస్టర్ బచ్చన్.. శర్వా 37 మూవీ షూటింగ్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు పిల్ల కలిగిన హీరోలు అయినటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాలో హీరోగా నటిస్తూ ఉండగా , రవితేజ "మిస్టర్ బచ్చన్" , శర్వానంద్ 37 అనే సినిమాల్లో హీరో లుగా నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం వీరు నటిస్తున్న సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.
అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. దానితో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా స్పీడ్ గా పూర్తి చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు రామోజీ ఫిలిం సిటీ లో ఈ మూవీ కి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ సంస్థ వారు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో భాగ్య శ్రీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తోనే ఈ బ్యూటీ తెలుగు తేరకు పరిచయం కానుంది. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఈ మూవీ కి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
శర్వానంద్ ప్రస్తుతం తన కెరీర్ లో 37 వ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. దానితో ఈ మూవీ కి మేకర్స్ టైటిల్ ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ మూవీ యొక్క షూటింగ్ ను శర్వా 37 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం ఈ సినిమా యొక్క షూటింగ్ ను నాగోలు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: