సోషల్ మీడియాలో ఆసక్తి రేపుతున్న రవళి తల్లి వ్యాఖ్యలు..!!

murali krishna
సోషల్ మీడియా వచ్చాక చాలా సంగతులు ప్రజలకు తెలుస్తున్నాయి మరుగునపడిన అనేక విషయాలు యూట్యూబ్ ఛానల్ లో దర్శనమిస్తున్నాయి ఇటీవల కాలంలో హరిత మరియు రవళిల తల్లి విజయలక్ష్మి యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూస్ హడావిడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది అందమైన హీరోయిన్లు రెండో పెళ్లి వాళ్ళని పెళ్లిళ్లు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అలాంటి వారిలో శ్రీదేవి, హేమమాలిని, సావిత్రి వంటి వాళ్ళు ఉన్నారు.అలాగే ఈ జనరేషన్ లో హన్సిక త్వరలో పెళ్లి చేసుకోబోయే వరలక్ష్మీ శరత్ కుమార్,అదితి రావు హైదరి వంటి హీరోయిన్స్ కూడా ఉన్నారు.ఈ విషయం పక్కన పెడితే.. ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించిన ఓ హీరోయిన్ తల్లి నువ్వు రెండో పెళ్లి వాడిని చేసుకుంటే నేను కచ్చితంగా నీ రెండు కాళ్లు విరిచేస్తా అంటూ షాకింగ్ వార్నింగ్ ఇచ్చిందట.మరి ఆ హీరోయిన్ ఎవరు.. ఆమె తల్లి ఎందుకు అలా మాట్లాడింది అనేది ఇప్పుడు చూద్దాం.. పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ రవళి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ సినిమాలో 'మా పెరటి జాం చెట్టు పళ్ళన్ని కుశలం అడిగా' అనే పాట ద్వారా ఈ హీరోయిన్ కి మంచి పాపులారిటీ పెరిగింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ చాలామంది హీరోల సినిమాల్లో నటించింది. ఇక ఈ హీరోయిన్ వెండితెరపై రాణిస్తే ఈమె సోదరి హరిత బుల్లితెరపై రాణించింది. అయితే కూతుర్లిద్దరూ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న సమయంలో హీరోయిన్ రవళి తల్లి ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు రెండో పెళ్లి వాళ్ళని పెళ్లి చేసుకోవడం గమనించి మీరు కూడా ఇండస్ట్రీలో ఉంటున్నారు.మీరు గనక రెండో పెళ్లి వాడిని పెళ్లి చేసుకుంటే చూడు కాళ్లు విరిచేస్తా..అలాంటి ఆలోచన కూడా మీ మైండ్ లోకి రాకూడదు అని వార్నింగ్ ఇచ్చారట.ఇక ఈ విషయాన్ని రీసెంట్ గానే రవళి తల్లి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: