"మనమే" రన్ టైమ్ లాక్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ కొంత కాలం క్రితం ఒకే ఒక జీవితం అనే సినిమా తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్నాడు . ఈ మూవీ కంటే ముందు వరస అపజాయలను ఎదుర్కొన్న శర్వానంద్ ఈ సినిమా విజయంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు . ఇక పోతే తాజాగా ఈ నటుడు మనమే అనే సినిమాలో హీరో గా నటించాడు . ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ జూన్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర నేపథ్యం లో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను చక చకా పూర్తి చేస్తూ వస్తున్నారు . అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది . ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ ను  కూడా మేకర్స్ లాక్ చేశారు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని 2 గంటల 35 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా పర్వాలేదు అనే స్థాయి రంగ్ టైమ్ తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రస్తుతానికి ఈ సినిమాపై మంచి అంచనాలు జనాల్లో ఉన్నాయి. మరి ఈ మూవీ జనాల అంచనాలను అందుకుంటుందో లేదో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: