ఆ "ఓటీటీ" లోకి ఎంట్రీ ఇచ్చిన మైదానం..!

Pulgam Srinivas
బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటుడు అయినటు వంటి అజయ్ దేవగన్ కొంత కాలం క్రితం మైదాన్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో ప్రియమణి ఓ కీలకమైన పాత్రలో నటించగా , బోనీ కపూర్ ఈ మూవీ ని నిర్మించాడు . ఈ మూవీ చాలా రోజుల నుండి షూటింగ్ జరుపుకొని కొంత కాలం క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుద ల అయింది.

ఇకపోతే విడుదల అయిన తర్వాత ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలే వచ్చినప్పటికీ ఎందుకో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ భారీ మొత్తంలో కలక్షన్ లను వసూలు చేయడంలో విఫలం అయింది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకున్న భారీ కలెక్షన్ లను వసూలు చేయలేకపోయిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లో రెంటల్ పద్ధతిలో అందుబాటులోకి వచ్చింది.

ఇకపోతే తాజాగా అమెజాన్ సంస్థ వారు ఈ సినిమాను రెంటల్ పద్ధతిలో కాకుండా ఫ్రీ గానే అందుబాటు లోకి తీసుకువచ్చారు. ఇకపోతే ఈ మూవీ ని కేవలం హిందీ లో మాత్రమే స్ట్రీమింగ్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ మూవీ ని ఇతర భాషలలో కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారేమో చూడాలి. అమిత్ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమాకు రహమాన్ అదిరిపోయే రేంజ్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ సంగీతానికి కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ad

సంబంధిత వార్తలు: