కోలీవుడ్: దారుణంగా మారిన పరిస్థితి?

Purushottham Vinay
ఈ ఏడాదిలో ఇప్పటిదాకా గుంటూరు కారం, హనుమాన్, టిల్లు స్క్వేర్ సినిమాలు తప్ప టాలీవుడ్ లో ఏ సినిమా చెప్పుకోదగ్గ హిట్ కొట్టలేదు. మనకైనా ఆ మూడు సినిమాలు ఉన్నాయి కానీ  మనకంటే చాలా దారుణంగా మారిపోయింది తమిళ ఇండస్ట్రీ పరిస్థితిప్పుడు. ఒక్క అరణ్మనై 4 సినిమా తప్ప ఏ సినిమా కనీసం హిట్టు కూడా కొట్టలేదు. భారీ అంచనాలతో వచ్చిన కెప్టెన్ మిల్లర్, అయలాన్, లాల్ సలాం చిత్రాలు కోలీవుడ్ కి ఈ ఏడాది మంచి ఊపుని ఇస్తాయని అనుకుంటే అవి దారుణంగా ప్లాప్ అయ్యాయి. కాలం కలిసిరాకపోతే అరటిపండు తిన్నా.. పన్ను ఇరుగుద్దని అంటారు కదా..? ఇప్పుడు కోలీవుడ్‌కు అచ్చు గుద్దినట్లు సెట్ అవుతుంది ఈ సామెత.కొత్త సినిమాల్లేక.. వచ్చిన సినిమాలకు ఆడియన్స్ లేక.. థియేటర్స్ మూసుకుంటున్నారు తమిళ ఎగ్జిబిటర్లు. అసలు ఉన్నట్లుండి కోలీవుడ్‌కు ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎందుకొచ్చింది..?గత రెండేళ్ల నుంచి విక్రమ్, పొన్నియన్ సెల్వన్, జైలర్ లాంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన కోలీవుడ్‌కు ఇప్పుడు బ్యాడ్ టైమ్ బాగా నడుస్తుంది. గతేడాది జైలర్ తరువాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ ఇప్పటిదాకా పడలేదు.సంక్రాంతికి ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివకార్తికేయన్ అయలాన్ లతో వచ్చినా కూడా రెండు సినిమాలు కనీసం 100 కోట్లు కూడా రాబట్టలేకపోయాయి.


ఇక ఈ సమ్మర్‌కు వస్తాయనుకున్న సూర్య, విక్రమ్, అజిత్ లు కూడా వాయిదా పడ్డాయి. భారీ సినిమాలు వస్తాయని ఆశలు పెట్టుకున్న ఎగ్జిబిటర్లకు చావు కబురు చల్లగా చెప్పారు నిర్మాతలు.విక్రంతో సూపర్ ఫాంలోకి వచ్చిన కమల్ హాసన్ ఇండియన్ 2 కూడా జులై 12న విడుదల కానుంది. అజిత్, విజయ్, రజినీకాంత్ సినిమాలు ఇంకా సెట్స్‌పైనే ఉన్నాయి. ఈ టైమ్‌లో ఫీడింగ్ లేక చాలా థియేటర్స్ ని కూడా మూసుకుంటున్నారు ఎగ్జిబిటర్లు.కోలీవుడ్ తోనే పోలిస్తే టాలీవుడ్ కాస్త బెటర్. ప్లాప్ టాక్ తోనే గుంటూరు కారం తో ఏకంగా 250 కోట్ల దాకా వసూళ్లు రాబట్టాడు మన సూపర్ స్టార్ మహేష్. హనుమాన్ తో 350 కోట్ల దాకా వసూళ్లు రాబట్టి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టాడు తేజ సజ్జ. టిల్లు స్క్వేర్ తో 100 కోట్లు కొట్టి సమ్మర్ లో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు సిద్దూ. ఇంకా మన దగ్గర కల్కి, పుష్ప 2, దేవర, గేమ్ ఛేంజర్, ఓజి అంటూ 2024లో రాబోయే పెద్ద ల పేర్లు చెప్తున్నాం. కానీ అక్కడ ఇండియన్ 2 తప్పిస్తే.. ఏది కనిపించట్లేదు. కంగువా, తంగలాన్ ఇంకా రిలీజ్ డేట్ చెప్పలేదు. విజయ్ గోట్ మాత్రమే ఈ సంవత్సరం రానుంది. మొత్తానికి స్టార్స్ వచ్చే దాకా థియేటర్స్‌లో ఆడియన్స్ కంటే ఈగలు, దోమలే కనిపించేలా ఉన్నాయిప్పుడు అంటున్నారు ఎగ్జిబిటర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: