బ్రహ్మాజీ సెటైర్ పోస్టు పై నవ్వులు కురిపిస్తున్న నేటిజన్స్..!!

murali krishna
టాలీవుడ్‌లో ఎన్నో ఏళ్లుగా నటుడిగా మంచి స్థానం సంపాదించుకున్నారు యాక్టర్ బ్రహ్మాజీ . హీరోగా ప్రారంభమైన ఆయన సినీ కెరీర్‌లో పలు సినిమాలతో అలరించారు.అనంతరం సపోర్టింగ్ రోల్స్, విలన్ పాత్రలు, కమెడియన్‌గా నటిస్తూ ఆదరాభిమానాలు పొందుతున్నారు.చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ స్టార్ హీరోలు, జూనియర్ కథానాయకులతో నటిస్తూ ప్రతి సినిమాలో మెరుస్తున్నారు నటుడు బ్రహ్మాజీ. సింధూరం సినిమాలో రవితేజతో  కలిసి నటించిన బ్రహ్మాజీ ఇటీవల టిల్లు స్క్వేర్, చారి 111, విరూపాక్ష, జాతి రత్నాలు వంటి సినిమాలతో అలరించారు. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే ఆయన నిజ జీవితంలో బ్రహ్మాజీ కామెడీ టైమింగ్ అదిరిపోతుంది.సోషల్ మీడియాలో మీమ్స్ డైలాగ్స్ కొడుతూ షోలలో సూపర్ ఫన్ జనరేట్ చేస్తుంటారు. అలాగే సెలబ్రిటీలకు సంబంధించిన పోస్టులకు, ప్రశ్నలకు ఇన్ డైరెక్ట్‌గా సెటైరికల్‌గా ఆన్సర్స్ ఇస్తూ నెటిజన్స్‌కు మంచి ఎంటర్టైన్‌మెంట్ అందిస్తుంటారు నటుడు బ్రహ్మాజీ. ఇక తాజాగా మరోసారి తన పోస్ట్ తో ఆకట్టుకున్నారు యాక్టర్ బ్రహ్మాజీ. ఈసారి హైదరాబాద్ రెస్టారెంట్లపై  కామెంట్ చేశారు.
ఇటీవల హైదరాబాద్‌లోని కొన్ని ఏరియాల్లోని పాపులర్ రెస్టారెంట్ల్స్, కేఫ్‌లపై ఫుడ్ సెఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ పేరొందిన హోటళ్లలో చెడిపోయిన, కల్తీ నిల్వ ఆహారం, కాలం చెల్లిన వస్తువులను వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. అలాగే ఏమాత్రం శుభ్రత లేకుండా అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఎక్స్ అకౌంట్‌లో అధికారికంగా పోస్ట్ పెట్టారు.ఈ విషయంపై తాజాగా నటుడు బ్రహ్మాజీ స్పందించారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ పోస్ట్ పై స్పందిస్తూ "సర్.. మరి ఎక్కడ తినమంటారు..? ఇంటిలోనా..?" అని తనదైన స్టైల్‌లో అడిగారు.
ఈ పోస్ట్ వెంటనే ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. దీంతో నెటిజన్స్ వివిధ రకాలుగా రియాక్ట్ అవుతున్నారు."ఇది అందరిని ఇంట్లో తినమని, బయటక తిండికి ఎక్కువగా అలవాటు పడకండి" అని ఇన్‌డైరెక్ట్‌గా బ్రహ్మాజీ హైదరాబాద్ రెస్టారెంట్లపై సెటైర్ వేసినట్లు నెటిజన్స్ అంటున్నారు. "ఏమైనా బ్రహ్మాజీ సార్ పోస్ట్ కు నవ్వాల్సిందే" అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు భారీగా బిల్లుల మోత మోగించే రెస్టారెంట్లు క్వాలిటీ ఆహారం అందించకపోవడంపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. మొత్తానికి మరోసారి బ్రహ్మాజీ పోస్ట్ వైరల్ అవుతోంది.ఇదిలా ఉంటే, ఇదివరకు సెలబ్రిటీలకు సంబంధించిన ప్రశ్నలకు కూడా వెటకారంగా ఆన్సర్స్ ఇచ్చేవారు. ఇక ఆదిపురుష్ టైమ్‌లో ఓం కమ్ టూ మై రూమ్ అని ప్రభాస్  చెప్పిన డైలాగ్ మీమ్స్‌లో బాగా వాడిన విషయం తెలిసిందే. ఇదే డైలాగ్‌ను లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ మూవీ ప్రమోషన్స్‌లో బ్రహ్మాజీ విపరీతంగా వాడారు. సుమ షోలోఏ ప్రశ్న అడిగినా కమ్ టు మై రూమ్ అంటూ ఫన్ జెనరేట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: