తన తల్లి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన ఐశ్వర్య రాజేష్..!?

Anilkumar
సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తన సొంత కష్టంతో హీరోయిన్గా దూసుకుపోతోంది. కేవలం హీరోయిన్ గాని కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న అన్ని పాత్రల్లో నటిస్తోంది ఐశ్వర్య రాజేష్. అయితే ప్రస్తుతం ఈమె తమిళంలో దాదాపుగా 8 కంటే ఎక్కువ సినిమాలు చేస్తోంది. తెలుగులో ఈమె వరల్డ్ ఫేమస్ లవర్ రిపబ్లిక్ వంటి సినిమాల్లో నటించింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా

 నాయక్ సినిమాలో రానాకి జోడిగా నటించే అవకాశం ఈమెకే వచ్చింది. కానీ వచ్చినట్టే వచ్చి అవకాశం చేజారింది. అయితే సౌత్ ని ఇండస్ట్రీలో ఇంతటి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ జీవితం మొత్తం కన్నీటి విషాదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా మదర్స్ డే సందర్భంగా ఆమె తన తల్లి గురించి కొన్ని విషాదకరమైన సంఘటనలను ఆమె అభిమానులతో పంచుకుంది. తన తల్లి అనుభవించిన కష్టాలను గురించి గుర్తుచేసుకొని బాధపడింది. తన తండ్రి అతి మంచితనం వల్లే తన కుటుంబం మొత్తం పాడైపోయింది

 అని ఆమె ఎమోషనల్ అయ్యింది. నాన్న మరణించాక అప్పుల భారం అమ్మ పై పడింది. అమ్మ నన్ను, అన్నలని పోషించడానికి నానా కష్టాలు అనుభవించింది. ఇక అప్పులు ఎలా తీరుస్తుంది. అందుకే ఉన్న ఒక్క ఫ్లాట్ అమ్మేసి అప్పులు తీర్చింది. అన్నలిద్దరూ చదువుకుని ప్రయోజకులు కాబోతున్నారు. అమ్మ అన్నలిద్దరిపై చాలా ఆశలే పెట్టుకుంది.  కానీ అత్యంత దురదృష్ట క్రమంగా ఐశ్వర్య రాజేష్ బ్రదర్స్ ప్రమాదంలో మరణించారు. దీనితో ఫ్యామిలీ దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళింది అని ఐశ్వర్య రాజేష్ ఆ విషాదాన్ని గుర్తు చేసుకుంది. కానీ అమ్మ ఆత్మ స్థైర్యం కోల్పోలేదు. అమ్మే నాకు ఆదర్శం అని ఐశ్వర్య రాజేష్ పేర్కొంది. దీంతో ఐశ్వర్య రాజేష్ చేసిన ఈ ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: