తల్లి కాబోతున్న కత్రినా కైఫ్.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నిజం..!?

Anilkumar
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి మనందరికీ తెలిసిందే. తెలుగు లో మల్లీశ్వరి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇటీవల సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్గా కనిపిస్తోంది. అయితే తాజాగా ఇప్పుడు ఈమెకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే కత్రినా కైఫ్ కు విక్కీ కౌశల్ కు గత మూడు సంవత్సరాల క్రితం పెళ్లయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు విక్కీ కౌశల్ కి త్వరలోనే వారసుడు రాబోతున్నాడు అన్న ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ముఖేష్ అంబానీ కొడుకు

 అనంత్ అంబానీ రాధిక ప్రీ వెడ్డింగ్ కార్యక్రమంలో కత్రినా తన పొట్టను పదేపదే కప్పుకోవడం చాలా మంది గమనించి ఉంటారు. దీంతో కత్రినా కైఫ్ తల్లి కాబోతోంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇటీవల కత్రినా కైఫ్ ఎక్కడ కనిపించినా కూడా బాగా లూస్ గా ఉన్న బట్టలను ధరిస్తూ కనిపిస్తుంది. దీంతో అందరూ అనుకుంటున్నట్లుగానే కత్రినా కైఫ్ తల్లి కాబోతోంది అని అందరూ అంటున్నారు. అయితే తాజాగా ఇప్పుడు ప్రెగ్నెన్సీ రూమర్లు తీవ్రమవుతుండటంతో కత్రినా కైఫ్ టీమ్ తాజాగా స్పందించినట్టు సమాచారం బయటికి వచ్చింది. కత్రినా కైఫ్ ప్రెగ్నెసీ రూమర్లను ఆమె టీమ్

 కొట్టిపారేసిందని తెలుస్తోంది. కత్రినా గర్భంతో లేరని తేల్చిసిందని రిపోర్టులు బయటికి వచ్చాయి. లండన్‍కు ఆమె వ్యక్తిగత కారణాలతోనే వెళ్లారని, ప్రెగ్నెసీ వల్ల కాదని క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే లండన్‍లో కత్రినా వద్దకు భర్త విక్కీ కౌశల్ వెళతారని , కత్రినా ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో లేరని బాలీవుడ్ లైఫ్ రిపోర్ట్ కూడా చెప్పుకు రావడంతో పుకార్లకి కాస్త బ్రేక్ పడ్డట్టు అయింది.  కత్రినా 2000లో విడుదలైన 'బూమ్'తో హిందీ చిత్రాల ప్రపంచంలోకి ప్రవేశించింది, అందులో ఆమె బోల్డ్ లుక్స్ ముద్దుల సన్నివేశాలు చాలా చర్చనీయాంశమయ్యాయి. ఈ చిత్రంలో కత్రినా తనకంటే 27 ఏళ్లు పెద్దదైన బాలీవుడ్ విలన్ గుల్షన్ గ్రోవర్‌తో ముద్దుల సీన్ ఇచ్చింది. చివరగా మేరీ క్రిస్మస్ చిత్రంలో కనిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: