అఫీషియల్ : "పుష్ప 2" కర్ణాటక హక్కులు దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క కర్ణాటక థియేటర్ హక్కులను అమ్మి వేశారు. 

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. ఈ సినిమా యొక్క కర్ణాటక హక్కులను ఎన్ సినిమా సంస్థ దక్కించుకున్నట్లు పుష్ప యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇక ఇప్పటికే పుష్ప పార్ట్ 1 మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో పుష్ప పార్ట్ 2 మూవీ పై కర్ణాటక ఏరియాలో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక భారీ అంచనాలు ఈ సినిమాపై కర్ణాటక లో ఉండడంతో ఈ మూవీ ని కర్ణాటక ఏరియాలో భారీ మొత్తంలో విడుదల చేయడానికి ఈ చిత్ర బృందం వారు సన్నాహాలను చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా ... ఈ సినిమాలో ఫాహధ్ ఫాజిల్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనసూయ , సునీల్ , రావు రమేష్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa

సంబంధిత వార్తలు: