వరుణ్ సందేశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో వరుణ్ సందేశ్ ఒకరు. ఈయన టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన హ్యాపీ డేస్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో ఈయనకు అద్భుతమైన గుర్తింపు లభించింది. దానితో ఆ తర్వాత ఈయనకు వరుస సినిమా అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఈయన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మించిన కొత్త బంగారు లోకం అనే సినిమాలో హీరో గా నటించాడు.
 

ఈ మూవీ కూడా అదిరిపోయే రేంజ్ విజయం సాధించడంతో ఈ నటుడి క్రేజ్ ఒక్క సారిగా తెలుగులో అమాంతం పెరిగిపోయింది. ఇక ఈయనకు అద్భుతమైన క్రేజీ ప్రాజెక్టులలో అవకాశాలు వచ్చాయి. కానీ కొత్త బంగారు లోకం సినిమా తర్వాత ఈయన నటించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోకపోవడంతో వరుసగా ఈయన ఇమేజ్ తగ్గుతూ వచ్చింది. ఇక ప్రస్తుతం ఈయనకు భారీ క్రేజ్ ఉన్న సినిమాలలో ఏ మాత్రం కూడా అవకాశాలు దక్కడం లేదు. ఈ నటుడు కొంత కాలం క్రితమే చిత్రం చూడరా అనే సినిమాలో హీరో గా నటించాడు.

ఆ మూవీ నిన్న ఈ టీవీ విన్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. దానికి కూడా ప్రేక్షకుల నుండి పెద్ద స్థాయిలో రెస్పాన్స్ దక్కడం లేదు. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు నింద అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి వరుణ్ సందేశ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ మూవీ కి రాజేష్ జగన్నాథం కథ , స్క్రీన్ ప్లే , డైరెక్షన్ మరియు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs

సంబంధిత వార్తలు: