ట్రోలర్ కి దిమ్మతిరిగే షాకింగ్ రిప్లై ఇచ్చిన రష్మీ..!!
రష్మీ గౌతమ్ ఈ నేపథ్యంలో వేగన్ గా మారిపోయారు. మాంసాహారమే కాకుండా పాలు, పాల ఉత్పత్తులు, కోడిగుడ్లకి కూడా ఆమె దూరంగా ఉంటారు. తాజాగా మూగజీవాలను సపోర్ట్ చేస్తూ రష్మీ చేసిన కామెంట్లు ట్రోల్ కి గురయ్యాయి.
హైదరాబాద్ లో ఒక చిన్న పిల్లాడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో చిన్నపిల్లాడి తల్లిదండ్రులది తప్పు అని రష్మీ వాదించింది. దాంతో అందరూ రష్మీని దారుణంగా ట్రోల్ చేశారు. బక్రీద్ సందర్భంగా జరిగే గోవధ పై కూడా ఆమె వ్యతిరేకంగా మాట్లాడడం వివాదాస్పదంగా మారింది.తాజాగా ఒక వ్యక్తి ఒక ఎద్దును కాల్చి చంపుతున్న వీడియో షేర్ చేస్తూ ఇది నిజంగా దారుణం అంటూ పేర్కొంది రష్మీ. ఇలాంటివి జరగకుండా ఎందుకు ఆపలేకపోతున్నాము అని ప్రశ్నించింది. దానికి ఒక వ్యక్తి ఆడపిల్లలు రేప్ కి గురవుతున్నారు. వాళ్ళని బట్టలు కూడా తీసి నగ్నంగా తిప్పుతున్నారు. వాటి మీద స్పందించని నువ్వు ఎద్దుని చంపితే కామెంట్లు చేస్తున్నావు. నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి అని కామెంట్ చేశాడు.దానికి రియాక్ట్ అయిన రష్మీ ఇవాళ ఎద్దును చంపిన వాడే రేపు మీ పిల్లల్ని కూడా చంపుతాడు. వాడికి మనిషికి పశువుకి తేడా తెలియదు అని ఇంకా ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఆమె పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.