"రత్నం" కి 7 రోజుల్లో తెలుగు రాష్ట్రాల వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటలలో ఒకరు అయినటువంటి విశాల్ తాజాగా రత్నం అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే తమిళ , తెలుగు భాషల్లో భారీ ఎత్తున విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజే కాస్త నెగటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి భారీ మొత్తంలో కలెక్షన్ లు దక్కడం లేదు. ఇక ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 7 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
రత్నం మూవీ కి 7 రోజుల్లో కలిపి నైజాం ఏరియాలో 71 లక్షల కలెక్షన్ లు దక్కగా , మొత్తం ఆంధ్రప్రదేశ్ లో కలిపి 99 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.70 కోట్ల షేర్ ... 3.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.5 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ మరో 2.80 కోట్ల షేర్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇకపోతే కోలీవుడ్ ఇండస్ట్రీ లో మాస్ దర్శకులలో ఒకరు అయినటువంటి హరి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఏ మూవీ కి సంగీతం అందించాడు. మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ప్రియ భవాని శంకర్ ఈ మూవీ లో విశాల్ కి జోడి గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: