వేశ్య పాత్రలో కాబోయే భార్య.. సిద్ధార్థ్ కామెంట్స్ వైరల్?

praveen
తమిళ హీరో అయినప్పటికీ అటు టాలీవుడ్ లో కూడా సిద్ధార్థ్ కి మంచి క్రేజ్ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు సిద్ధార్త్ నటించిన ఎన్నో సినిమాలు టాలీవుడ్ లో కూడా విడుదలై మంచి విజయాలను కూడా సాధించాయి అని చెప్పాలి  ఇక ఒక రకంగా చెప్పాలంటే పక్కింటి కుర్రాడు అనే ట్యాగ్ ని కూడా సొంతం చేసుకున్నాడు సిద్ధార్థ్. మరి ముఖ్యంగా అటు బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులందరికీ హృదయాలకు మరింత దగ్గర అయిపోయాడు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు ఈ హీరో. మరికొన్ని రోజుల్లో ఓ ఇంటివాడు కూడా కాబోతున్నాడు అన్న విషయం తెలిసిందే.

 క్యూట్ హీరోయిన్ అతిధిరావు హైదరితో ఇటీవల నిశ్చితార్థాన్ని కూడా చేసుకున్నాడు  ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఇక త్వరలోనే పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నాడు ఈ సినీ సెలబ్రిటీ జంట. ఇకపోతే ఇటీవల అతిథి రావు హైదరి నటించిన ఒక వెబ్ సిరీస్ సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయింది. అతిథి రావు హైదరి ఇక ఈ వెబ్ సిరీస్ లో  వేశ్యపాత్రలో నటించింది. అయితే ఇక ఇదే సిరీస్ లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హాలు కూడా ప్రధాన పాత్రలో నటించడం గమనార్హం.

 200 కోట్ల బడ్జెట్ తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన వెబ్ సిరీస్ గా తెరకెక్కింది ఈ సిరీస్. ఇక మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే హీరామండి వెబ్ సిరీస్ పై సిద్ధార్థ్ తన రివ్యూ ని చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్ పై ప్రశంసలు కురిపించాడు. మనం కూడా సంజయ్ లీల బన్సాలి యుగంలో ఉన్నందుకు సంతోషించాలి. ఈ వెబ్ సిరీస్ లో సౌందర్యం, మ్యూజిక్, యాక్టింగ్ కథ అని అద్భుతంగా ఉన్నాయి. ఆ కాలం పరిమితులకు లోబడి చెప్పిన ఒక మంచి డ్రామా ఇది. ఇక ఆ రోజుల్లో ఉండే ప్రేమ స్వేచ్ఛకు సంబంధించి సంజయ్ లీల చెప్పిన కథ హత్తుకుంటుంది అంటూ సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు. ఒకరకంగా తనకు కాబోయే భార్య అదితి రావు హైదరి అటు వేశ్యపాత్రలో నటించి నటనతో ఆకట్టుకోవడం కూడా తనకు నచ్చింది అంటూ సిద్ధార్థ్ ఇండైరెక్టుగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: