జై హనుమాన్ పై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!?

Anilkumar
ఇటీవల విడుదలైన హనుమాన్ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. అయితే హనుమాన్ సినిమాకి కొనసాగింపుగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా జై హనుమాన్. శ్రీరామనవమి పర్వదినాన పురస్కరించుకొని సినీ ప్రియులందరీకీ ఆయన ఒక మాటని ఇచ్చారు. ఆ శ్రీరాముడు ఆశీస్సులతో ప్రపంచమంతా ఉన్న సినీ ప్రియులకు నేను మాటిస్తున్నాను.. జీవితాంతం గుర్తు పెట్టుకునేలా జై హనుమాన్ సినిమాతో అద్భుతమైన అనుభూతిని అందిస్తా.. అందరికీ ఈ సినిమా ఎంతో ప్రత్యేకంగా కానుంది అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు .

ఈ మేరకు రాముడికి హనుమంతుడికి మాటిస్తున్నట్టుగా ఉన్న ఒక స్పెషల్ పోస్టర్ను సైతం దానికి జోడించి షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో సినీ ప్రియులందరి దృష్టి ఇప్పుడు ఆ పోస్ట్ పై పడింది. ఇక హనుమాన్ సినిమా విషయానికి వస్తే.. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా హనుమాన్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కాసుల వర్షం కురిపించింది. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన ఆ మాట ఏంటి అనే ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు జై హనుమాన్ సినిమా రాబోతోంది.

 ఇక ఈ సినిమా 2025లో విడుదల కాబోతోంది. జనవరి నెలలో ప్రీ ప్రొడక్షన్ పనులు సైతం స్టార్ట్ చేశారు. త్వరలోనే సినిమాకి సంబంధించిన షూటింగ్లో సైతం ప్రారంభించబోతున్నారు. త్వరలోనే షూట్‌ ప్రారంభించనున్నారు. గత చిత్రంతో పోలిస్తే సీక్వెల్‌ 100 రెట్లు భారీ స్థాయిలో ఉంటుందని ప్రశాంత్‌ గతంలో చెప్పారు. హనుమంతుడి పాత్రలో స్టార్ హీరో యాక్ట్‌ చేస్తారన్నారు.సూపర్‌ హీరో కథకు ఇతిహాసాన్ని ముడిపెట్టి తీసిన చిత్రం 'హను-మాన్‌' .  తేజ సజ్జా హీరోగా నటించగా.. అమృతాఅయ్యర్‌ కథానాయిక పాత్ర పోషించారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌, వినయ్‌రాయ్‌, గెటప్‌ శ్రీను, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రల్లో కనిపించారు. రూ.40 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రం సుమారు రూ.300 కోట్లకు పైగా వసూలు చేసినట్లు అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: