వైరల్ గా మారిన ప్రభాస్ హీరోయిన్ వ్యాఖ్యలు...!!
హీరోలు లేనప్పటికీ క్రూ మూవీ బాగా ఆడుతోంది. ఇది చూసైనా సరే ఇండస్ట్రీ లో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను అని ఆమె తెలిపింది. అయితే కృతిసనన్ చెప్పింది నిజమే. ఎందుకంటే ఒకప్పుడు ప్రేక్షకులు..హీరోల కోసం సినిమాలకు వచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం కంటెంట్ బాగుందా? ఎంటర్ టైన్ మెంట్ ఉందా? ఇలాంటివీ చాలా ఆలోచిస్తున్నారు.ఇందులో భాగంగా తన క్రూ మూవీ హిట్టయ్యేసరికి కృతి ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. అయితే కొందరు ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా మరికొందరి మాత్రం ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకపోతే కృతి సనన్ మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. అలాగే టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది.