ఓం భీమ్ బుష్ : ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రేజీ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

murali krishna
ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయిన క్రేజీ కామెడి మూవీ “ఓమ్ భీమ్ బుష్”.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.. ఈ మూవీలో శ్రీవిష్ణు, ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు.హారర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ అదిరిపోయే టాక్ తో దూసుకుపోతుంది..అయితే ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్‌ను దక్కించుకున్న ఈ మూవీ థియేటర్లలో విడుదలైన నెలలోపే ఓటీటీలోకి రాబోతోంది.ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నది. ఈ కామెడీ మూవీ ఎప్రిల్ లాస్ట్ వీక్‌లో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.తాజా సమాచారం ప్రకారం అనుకున్నదానికంటే ముందుగానే ఓ భీమ్ బుష్ ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తుంది.. ఏప్రిల్ 19 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. 

ఏప్రిల్ సెకండ్ వీక్‌లో ఓం భీమ్ బుష్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం. ఈ క్రేజీ కామెడీ మూవీకి శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించాడు. హుషారు మరియు రౌడీ బాయ్స్  వంటి క్రేజీ మూవీస్ తర్వాత శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన మూడో సినిమా ఇదే కావడం విశేషం.. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా తొమ్మిదిన్నర కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి  పది కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ ఎనిమిది రోజుల్లో వరల్డ్ వైడ్‌గా పదిహారు కోట్లకుపైగా గ్రాస్‌ను, ఎనిమిది కోట్ల యాభై లక్షల వరకు షేర్ కలెక్షన్స్‌ను  రాబట్టింది.ఈ మూవీలో  ప్రీతి ముకుందన్‌ మరియు ఆయేషాఖాన్ హీరోయిన్లుగా నటించారు. సన్నీ ఎం.ఆర్ ఈ క్రేజీ మూవీకి మ్యూజిక్ అందించాడు. బ్రోచేవారెవరురాతో  సూపర్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు ఓం భీమ్ బుష్‌లో మరోసారి ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేశారు. ఈ ముగ్గురి కాంబో సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: