నాతో నటించడానికి ముందు నో చెప్పి ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు... శృతిహాసన్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లోక నాయకుడు కమల్ హాసన్ కూతురుగా సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి తన నటన తో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సినీ పరిశ్రమలో దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో వరస విజయాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను సాగిస్తోంది. పోయిన సంవత్సరం ఈ బ్యూటీ మొదట గా వీర సింహా రెడ్డి మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత వాల్టేరు వీరయ్య మూవీ తో మరో విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత హాయ్ మన్న సినిమాలో గెస్ట్ రోల్ లో నటించింది. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది. ఇక పోయిన సంవత్సరం చివరలో సలార్ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ ఈ సినిమాతో కూడా మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ లియో మూవీ డైరెక్టర్ అయినటువంటి లోకేష్ కనకరాజు తో కలిసి ఇనిమోల్ మ్యూజిక్ ఆల్బమ్ లో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఆల్బమ్ గురించి శృతి హాసన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

తాజాగా శృతి హాసన్ మాట్లాడుతూ ... మొదట ఈ ఆల్బమ్ గురించి లోకేష్ ను సంప్రదించగా ఆయన మొదట ఇందులో నటించేందుకు నో చెప్పాడు. కానీ ఆ తర్వాత ఈ సాంగ్ కాన్సెప్ట్ మొత్తం విని ఆయన ఇందులో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని శృతి హాసన్ తాజాగా చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రస్తుతం శృతి హాసన్ చేతిలో అనేక క్రేజీ మూవీ లు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: