"విశ్వంభర" సెట్స్ లో ఆ ముగ్గురు..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని త్రిష , చిరంజీవి కి జోడిగా నటిస్తూ ఉండగా ... టాలెంటెడ్ డైరెక్టర్ మల్లాడి వశిష్ట ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ కి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తూ ఉండగా ... యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ లు ఈ సినిమాను ఎంతో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది.
 

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా పూర్తయింది. ఇకపోతే చాలా రోజుల క్రితమే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ విడుదల తేదీని ఇప్పటికే ఈ చిత్ర బృందం లాక్ చేయడంతో ఆ తేదీన ఎలాగైనా ఈ సినిమాను విడుదల చేయాలి అనే ఉద్దేశంతో ఈ మూవీ షూటింగ్ ను చాలా స్పీడ్ గా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న త్రిష తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని పాటలను పోస్ట్ చేసింది.

అందులో త్రిష తో పాటు మెగాస్టార్ చిరంజీవి ... ఎం ఎం కీరవాణి కూడా ఉన్నారు. ఇక త్రిష ఈ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయడం తోనే ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే విశ్వంభర మూవీ లో ఇషా చావ్లా , సురభి కూడా కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. వీరిద్దరూ ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెళ్ల పాత్రలలో కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: