షాక్:ప్రమాదం నుంచి బయటపడ్డ రాజమౌళి కుటుంబం.. ఏం జరిగిందంటే..?

Divya
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా పేరు పొందిన రాజమౌళి rrr చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ సినిమా వచ్చి ఇప్పటికీ మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ సినిమాకి ఉన్న క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు.. ముఖ్యంగా జపాన్లో విడుదలైన ఈ సినిమా సక్సెస్ఫుల్గా ఏడాదిన్నరగా థియేటర్లోనే రన్ అవుతూ ఉన్నది.. ఈ సందర్భంగా అక్కడ థియేటర్లో ఏర్పాటు చేసిన ఒక స్పెషల్ షో కి సైతం రాజమౌళి కుటుంబంతో సహా వెళ్లడం జరిగింది.. అక్కడ రాజమౌళి పెను ప్రమాదం నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఒక్క సారిగా జపాన్ లో భూకంపం రావడంతో భూకంపం నుంచి తప్పించుకున్నారనే విషయాన్ని రాజమౌళి కుమారుడు కార్తికేయ స్వయంగా తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు.తాము ఒక బిల్డింగులో 28వ అంతస్తులు ఉంటున్న సమయంలో మెల్లగా భూమి కదలడం కనిపించడం మొదలయ్యిందంటూ తమ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.. మొదటిసారి జపాన్లో భూకంపం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మేము ఇక్కడ చూసామంటూ కార్తికేయ వెల్లడించారు.. మొదటిసారి టెన్షన్ పడ్డాము కానీ జపనీయులు మాత్రం ఎక్కడ ఆందోళన చెందకుండా చాలా కూల్ గా ఏదో వర్షాలు పడుతున్నట్టుగా తేలికగా తీసుకున్నారని తెలిపారు.

అయితే మేము మాత్రం మొత్తం భూకంపాన్ని ఎక్స్పీరియన్స్ చేశామంటూ కార్తికేయ తన ట్విట్టర్ నుంచి వెల్లడించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాజమౌళి అభిమానుల సైతం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.. కానీ అక్కడ ఏమి రాజమౌళి కుటుంబానికి కాలేదని తెలిసి కాస్త ఊపిరిని పీల్చుకున్నారు.. ప్రస్తుతం ఈ విషయం అయితే వైరల్ గా మారుతున్నది రాజమౌళి సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబుతో కలిసి..SSMB -29 అనే చిత్రాన్ని త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.మహేష్ బాబు ఈ సినిమా కోసం పలు రకాల కసరత్తులు చేస్తూ ఉన్నారు.అందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారుతూ ఉన్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: