కళ్ళు చెదిరే అందాలతో రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటోస్..!

Anilkumar
ఊహలు గుసగుసలాడే సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది రాశి ఖన్నా. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత వెంటనే తనకి వేరే సినిమా ఆఫర్లు రావడంతో బిజీ హీరోయిన్ అయిపోయింది. మొదటి సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ ముద్దుగుమ్మకి ఆ తర్వాత ఆఫర్లు వచ్చాయి. ఇలా యంగ్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత స్టార్ హీరోల సరసన కూడా నటించే అవకాశాన్ని అందుకుంది. ఇక ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ జోరు శివం బెంగాల్ టైగర్ వంటి సినిమాలతో భారీ విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ కి తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అవకాశాలు వచ్చాయి. కానీ ఊహించని విధంగా ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్లు తగ్గిపోయాయి. తమిళంలో కూడా ఈ ముద్దుగుమ్మకి ఆఫర్లు వచ్చాయి. కానీ పెద్దగా సక్సెస్ అందుకోలేదు ఆక్సిజన్ టచ్ చేసి చూడు వంటి సినిమాలతో డిజాస్టర్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే వరుణ్ తేజ్ తో కలిసి తొలిప్రేమ సినిమా చేసింది. ఇక ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది .ఆ తర్వాత ఈ బ్యూటీ చేసిన సినిమాలు ఏవి అంతగా ఆకట్టుకోలేదు. తెలుగు, తమిళంలో సినిమాలు చేసింది.

ఒక్క అరణ్మనై మూవీ తప్ప మిగిలినవి అన్నీ బోల్తా కొట్టాయి. దీంతో రాశీ కెరీర్‌ ఒక్కసారిగా డౌన్‌ అయ్యింది.   తమిళంలో అరణ్మనై 4`, మేథావి`తోపాటు హిందీలో `ది రబర్మట్టి రిపోర్ట్, టీఎంఈ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే తెలుగులో ఈ బ్యూటీకి ఆఫర్లు లేవు.  ఈ క్రమంలో అందాల విందు చేస్తుంది రాశీఖన్నా. రాశీఖన్నా ఇటీవల గ్లామర్‌ విషయంలో డోస్‌ పెంచింది. అందాల ఆరబోతకి గేట్లు ఎత్తేస్తూ షాకిస్తుంది. నెటిజన్లకి తన అందాలను సరికొత్తగా ఆవిష్కరిస్తూ రచ్చ చేస్తుంది. లేటెస్ట్ గా ఆమె ఫోటో షూట్‌ మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. కళ్లు జిగేల్‌ మనేలా చేస్తుంది. క్లీవేజ్‌ షో చేస్తూ ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: