బోల్డ్ సీన్స్ చేయడంపై షాకింగ్ కామెంట్స్ చేసిన అనుపమ పరమేశ్వరన్..!?

Anilkumar
కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపుగా కొన్నేళ్ళు అవుతుంది. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు పెద్దగా గ్లామర్ షో అయితే చేయలేదు. ఒక్క రౌడీ బాయ్స్ సినిమాలో మాత్రమే ఈ ముద్దుగుమ్మ కాస్త హద్దులు దాటింది. కానీ ఈ సినిమా కంటే ముందు సినిమా వరకు కాస్త కూడా గ్లామర్ షో చేసింది. లేదు ఇక ఈ సినిమాలో కాస్త ముద్దు సీన్లలో నటించింది ఈ బ్యూటీ. ఆ ఒక్క సినిమా తప్ప ఇప్పటివరకు తన కెరియర్ లో హద్దులు దాటి చేసిన సన్నివేశాల సినిమాలు ఒక్కటి కూడా లేవో ఎప్పుడు ఈమె చేసే సినిమాల్లో చాలా ట్రెడిషనల్ గా తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తుంది ఈ బ్యూటీ.

కానీ తాజాగా ఇప్పుడు ఆమె సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న డీజే టిల్లు టు సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో మాత్రం రొమాన్స్ పీక్స్ లో ఉంది. రొమాన్స్ సన్నివేశాల్లో హద్దులు దాటి నటిస్తోంది ఈ బ్యూటీ. అయితే ఇండస్ట్రీలో నిలబడాలంటే కచ్చితంగా అందాల ఆరబోత చేయాల్సిందే అనే అనుపమ ఫిక్సయినట్లుంది. డీజే టిల్లు-2 సినిమా నుంచి రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ పోస్టర్‌.. ఫస్ట్‌ లుక్‌ ఇలా ప్రతి పోస్టర్‌లో గ్లామర్‌ షోనే చూపిస్తోంది అనుపమ. బోల్డ్‌ సీన్లలో నటించడంపై పలువురు ప్రశ్నించగా దీనికి కౌంటర్‌గానే సమాధానం చెప్పింది అనుపమ పరమేశ్వరణ్‌.

బిర్యానీ ఎంత ఇష్టం ఉన్నా ప్రతిరోజూ తినలేం కదా అని కామెంట్ చేసింది. అదే విధంగా కొన్నేళ్లుగా ఒకే రకమైన క్యారెక్టర్స్‌ మళ్లీ మళ్లీ చేస్తుంటే ఎవరికైనా బోర్ కొడుతుందని చెప్పింది. అందుకే టిల్లు స్క్వేర్‌లో లిల్లి రోల్‌ చేశానని చెప్పింది. ఈ పాత్రను మిస్ చేసుకుంటే అది తన చెత్త నిర్ణయమే అవుతుందని భావించినట్లు అనుపమ పేర్కొంది. అందుకే ఈ సినిమాకు ఒప్పుకున్నానని వివరణ ఇచ్చింది. అంతేకాదు.. డైరెక్టర్‌ చెప్పినట్లుగానే సినిమాలో క్యారెక్టర్‌ కోసం నటించినట్లు అనుపమ పరమేశ్వరణ్ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: