భర్తతో విడాకుల తర్వాత మళ్లీ అతనితో ప్రేమలో పడ్డ ఐశ్వర్య రజినీకాంత్..!?

Anilkumar
సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే రజనీకాంత్ స్టైల్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇక ఆయన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ కూడా బాగా నే గుర్తింపు తెచ్చుకుంది. తన దర్శకత్వంలో తెలుగులో కూడా తన సినిమాల్లో నటించి మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే  కొద్ది రోజుల క్రితం ఆమె తన భర్త ధనుష్ నుండి విడాకులు తీసుకుని విడిపోయింది. ఇక అపట్లో ఈ వార్త ఎంత సెన్సేషనల్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐశ్వర్యా రజినీకాంత్ ధనుష్ గత ఏడాది విడాకులు తీసుకును విడిపోయారు. 

కానీ ఏ కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు అన్నదానిపై క్లారిటీ అయితే లేదు. ఇక విడిపోయిన తర్వాత వీరిద్దరూ కలిసి కూడా ఉండడం లేదు. ఎవరి పనులతో ప్రస్తుతం వారు బిజీగా ఉన్నారు. ఇటు ధనుష్ సినిమాల పనిలో బిజీగా ఉన్నాడు. అయితే విడాకుల తర్వాత ఐశ్వర్య ఓ ఇంటర్వ్యూలో అనిరుధ్ గురించి మాట్లాడుతూ.. అనిరుధ్ రవిచందర్ జీవితంలో ధనుష్ ప్రత్యేకమైన వ్యక్తి అంటూ ఆసక్తికర విషయం తెలియజేసింది. అనిరుధ్‌లోని టాలెంట్‌ని ధనుష్ గుర్తించాడని, పై చదవులు చదివించేందుకు వారి తల్లిదండ్రులు సింగపూర్ పంపించాలని అనుకోగా ,

ధనుష్ అతనిలో టాలెంట్ గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి సినిమా పరిశ్రమలోకి తీసుకొచ్చారని పేర్కొంది. అనిరుధ్‌కు ఇంత మంచి పేరు వచ్చిందంటే ధనుష్ కారణమని కూడా తెలియజేసింది. విడాకుల తర్వాత తొలిసారి ధనుష్ గురించి ఇంత మంచిగా చెప్పిందంటే మరోసారి అతని ప్రేమలో పడిందని త్వరలో ధనుష్‌, ఐశ్వర్య కలవడం ఖాయమని కొందరు చెప్పుకొస్తున్నారు…  ఇక ఇదిలా ఉంటే ఇటీవల లాల్ సలాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఐశ్వర్య రజినీకాంత్. ఆమెకి ఇప్పుడు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అయినప్పటికీ రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందని ఇటీవల ప్రచారం జరిగింది. కాని దానిపై క్లారిటీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: