కెరియర్ గ్యాప్ వల్ల తన జీవితం ఎలా మారిందో చెప్పిన సమంత..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత  సినిమాలకి గ్యాప్ ఇచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే. ఇక సినీ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. బడ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ వరస సినిమాలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే సమంతకి ఆ మధ్యకాలంలో మయోసైటిస్ వ్యాధి వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. అందుకుగాను దాదాపుగా ఏడాది పాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. తన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మళ్లీ ఇప్పుడిప్పుడే సినిమాలపై ఫోకస్ చేస్తుంది.

అయితే ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంతా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. తన జీవిత జర్నీ పైన స్పందించింది. దీంతో సమంత మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సామ్ స్పందిస్తూ.. లైఫ్ లో నేను ఎన్నో అప్స్ అండ్ డైన్స్ చూశాను. ఒకసారి సంతోషం.. ఒకసారి బాధ కలిగాయి. నా జీవితంలో మంచి.. చెడు రెండూ ఉన్నాయి. విధి దయతలచింది. ప్రజలు కూడా నా మద్దతుగా నిలిచారు. అందుకు ధన్యవాదాలు. ఇప్పటివరకు అన్నీ అనుభవాలు ఎదురయ్యారు.

ఎన్నో విషయాలను తెలియజేశాయి. ఇకపై నా జీవితంలో ఎలాంటి మార్పులు ఉండబోవు.. మునపటి లాగే కొనసాగుతానని చెప్పింది. ఇక సామ్ నెక్ట్స్ 'సిటడెల్' అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక సమంత మయోసైటిస్ తర్వాత ఖుషి సినిమా చేసింది. కాగా ఖుషి సినిమాతో భారీ  విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది విజయ్ దేవరకొండ సమంత కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో భాగంగానే మయో సైంటిస్ట్ నుండి త్వరగా కోలుకోవాలి అని సమంత అభిమానులు కోరుకుంటున్నారు మరి మయోసైటిస్ తర్వాత సినిమాలపరంగా సమంత బిజీ అవుతుందా లేదా అన్నది చూడాలి.!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: