ట్రెడిషనల్ లుక్ లో అనసూయ లేటెస్ట్ ఫోటోస్..!

Anilkumar
టాలీవుడ్ లో టాప్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెరపై ఎంతో  గుర్తింపు తెచ్చుకున్న ఈమె ప్రస్తుతం వరుస  సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం వెండితెరపై తన సత్తా చూపిస్తోంది. జబర్దస్త్ వంటి షోలకి యాంకరింగ్ చేస్తూ భారీగా క్రేజ్ సంపాదించుకుంది ఈమె. ఆ తర్వాత తనకి సినిమాల్లో అవకాశాలు పెద్ద ఎత్తున రావడంతో బుల్లితెర కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ పూర్తిగా బుల్లితెరకి దూరమైంది.

 ప్రస్తుతం అనసూయ పుష్పటు సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతోంది. దాక్షాయని పాత్రలో నటిస్తోంది అనసూయ. అనసూయకి ఎంత క్రేజ్ ఉందో అదే స్థాయిలో వివాదాలు కూడా వెంటాడుతూ ఉంటాయి. గత ఏడాది అనసూయ పలు వివాదాస్పద సంఘటనలతో ట్రోలింగ్ ఎదుర్కొంది. అందులో ఆంటీ అంశం ఒకటైతే మరొకరి విజయ్ దేవరకొండ అంశం. విజయ్ దేవరకొండని అనసూయ ఎప్పుడూ గిల్లుతూ పరోక్షంగా పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. విజయ్ ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో అనసూయని టార్గెట్ చేశారు.

ఇక అనసూయని బాధపెట్టిన మరో అంశం నెటిజన్లు ఆమెని టార్గెట్ చేసి మరీ ఆంటీ అని పిలవడం. ఆంటీ అంటూ అనసూయపై పోస్ట్ లు పెట్టారు. ఇటీవల అనసూయ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ ట్రోలర్స్ పై తన అభిప్రాయం చెప్పింది. ట్రోలర్స్ అంటే వికారమైన జీవులు. వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాళ్ళకి ఏదో ఒకటి చెబుతూ ఇకపై టైం వేస్ట్ చేసుకోను అని తెలిపింది. తాజాగా అనసూయ షేర్ చేసిన ఫొటోస్ అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. యువత ఉక్కిరి బిక్కిరయ్యే విధంగా హాఫ్ శారీ లో ఫోజులు ఇస్తోంది. అనసూయ తన బంధువుల పెళ్లి వేడుక కోసం ఇలా పసుపు హాఫ్ శారీలో ట్రెడిషనల్ గా మెరిసింది. తన భర్త, పిల్లలతో కలసి సందడి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: